నిజామాబాద్

0
79

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 కార్యక్రమంలో భాగంగా నందిపేట్ గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం నిర్మించనున్న గ్రామ సంఘం (వీవో బిల్డింగ్) భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం గారు హాజరై భూమిపూజ నిర్వహించారు. అలాగే ఉప సర్పంచ్ చందర్, వార్డు సభ్యులు రిమ్మ రవి, కంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, భాస్కర్ పాల్గొన్నారు.

 

కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం, సీసీలు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ఈ గ్రామ సంఘం భవనం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ భవనం కీలక పాత్ర పోషించనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్ధరించాలి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
*వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి    సత్వరమే నూతన వె్జ్ బోర్డు ఏర్పాటు...
By Rajini Kumari 2026-03-28 14:26:00 0 215
Telangana
అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతన్నలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల (Unseasonal Rains) కారణంగా తెలంగాణ రాష్ట్రంల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం...
By Ponnala Srinivasrao 2026-05-27 04:15:49 0 100
Andhra Pradesh
పుంగనూరులో ఎంవీఐ సుప్రియ ఆకస్మిక తనిఖీలు: వాహనదారులకు హెచ్చరిక
పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఎంవీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు...
By Kothuru Murali 2026-06-24 16:31:54 0 40
Andhra Pradesh
చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
మదనపల్లె నియోజకవర్గం నీటుగట్టువారిపల్లి శాంతినగర్‌లో నూతనంగా వెలసిన చౌడేశ్వరి అమ్మవారి...
By Pagadala Venkateswar 2026-04-05 05:41:45 0 171
Andhra Pradesh
మీభూమి మీ హక్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*ఆత్మకూరు, జనవరి 5:*   *అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్...
By Rajini Kumari 2026-01-05 11:49:53 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com