పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతోంది : డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

0
472

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారం మోపడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇంధన ధరల పెంపుతో రవాణా ఛార్జీలు, సరుకు రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ సాధారణ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ తారీక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు

Search
Categories
Read More
Kerala
Kerala: Wife allegedly murdered husband in Kannur's Kaithapram village
Kannur Murder Case: Auto Driver’s Wife Arrested for Allegedly Orchestrating Husband’s...
By BMA ADMIN 2025-05-20 05:14:04 0 2K
Goa
Rising Tensions: The Brewing Conflict Over Mhadei River Diversion
Panaji: The long-standing battle over the Mhadei River has intensified as the controversy over...
By Dunna Jessicaruth 2026-05-14 07:18:17 0 71
Andhra Pradesh
పుంగనూరు: మోహిని అవతారంలో జగన్మోహనకారుడు
పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక...
By Kothuru Murali 2026-03-02 03:27:23 0 124
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 162
Andhra Pradesh
పుంగనూరు: శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
శనివారం, పుంగనూరు పట్టణ సమీపంలోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర...
By Kothuru Murali 2026-05-16 15:57:46 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com