తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు

0
224

వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38),  సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో విచారణ జరపగా తన పేరు, చిరునామా వివరాలు వెల్లడించాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా వారు స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన ధృవీకరణ అనంతరం వేదమూర్తిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వేటపాలెం ఎస్సై తెలిపారు.
ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు: ఫిట్స్ రావడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, ఈడీగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని...
By Kothuru Murali 2026-04-19 11:21:40 0 98
Telangana
వరుణ దేవా కరుణించు వర్షాల కోసం బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జులై 10 సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్తులు...
By Pindikura Mahesh 2026-07-11 02:49:23 0 141
Andhra Pradesh
మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ.
మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష...
By Pagadala Venkateswar 2026-04-08 13:57:01 0 135
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 2K
Andhra Pradesh
పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారం - ఎన్.ఆర్. అండ్ పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వెల్లడి
చీరాల  చీరాల, వేటపాలెం మండలాల్లోని పదవ తరగతి ఫలితాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం...
By Vadlamudi NagaVenkat 2026-05-13 02:43:37 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com