తప్పిపోయిన వ్యక్తిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు

0
134

వేటపాలెం : ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తిని వేటపాలెం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చిన్నగంజాం అంబేద్కర్ కాలనీకి చెందిన పులగోర వేదమూర్తి (38),  సుమారు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి అతని కోసం వెతుకులాట కొనసాగుతుండగా, వేటపాలెం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్‌లో విచారణ జరపగా తన పేరు, చిరునామా వివరాలు వెల్లడించాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా వారు స్టేషన్‌కు చేరుకున్నారు. అవసరమైన ధృవీకరణ అనంతరం వేదమూర్తిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వేటపాలెం ఎస్సై తెలిపారు.
ఏడాది తర్వాత తమ కుటుంబ సభ్యుడు క్షేమంగా తిరిగి రావడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ టీచర్లకు ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు, ప్రమోషన్లు.
AP: ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయులకు బదిలీలు,...
By Pagadala Venkateswar 2026-01-24 06:35:02 0 97
Andhra Pradesh
మైనర్ బాలికపై లైంగిక దాడి, తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి...
By Pagadala Venkateswar 2026-03-23 04:02:04 0 109
Andhra Pradesh
మొవ్వ పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం
కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గం :   మొవ్వ (మ) పెడసనగల్లు గ్రామంలో మైనర్ బాలికపై...
By Rajini Kumari 2025-12-23 10:10:28 0 136
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-14 14:50:32 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com