జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 

0
59

జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 

పార్టీ శ్రేణులు, ప్రజలతో మరింతగా మమేకం కావాలి 

క్షేత్ర స్థాయిలో జనసేన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేయాలి 

విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం 

జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గురువారం రాత్రి విజయవాడలో నిర్వహించిన పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా ముందుకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో ప్రజలతో... అదే సమయంలో జనసేన శ్రేణులతో మరింతగా మమేకం కావడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. 

పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకి, జన సైనికుడికి అండగా నిలవాలి. వారి సాధక బాధకాలు తెలుసుకొని భరోసా ఇవ్వాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల నిర్వహణ షెడ్యూల్ ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుసరించాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ను ఎప్పటికప్పుడు తెలియచేయాలి” అన్నారు. ఈ సందర్భంగా జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణకు పార్లమెంట్ నియోజక వర్గాలకు పరిశీలకులుగా వెళ్ళిన ప్రజా ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులు, కమిటీ సభ్యులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు శ్రీ వి.బాలశౌరి గారు, శ్రీ టి ఉదయ్ శ్రీనివాస్ గారు, శ్రీ లింగమనేని రమేష్ గారు, ఎమ్మెల్సీలు శ్రీ నాగబాబు గారు, శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు సిహెచ్ సూపర్డెంట్ ఎంవీ కోటిరెడ్డి పదవి విరమణ!
పోలవరం జిల్లా చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) సూపరింటెండెంట్, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.వి....
By Shyamala Yadagiri 2026-05-31 14:57:25 0 212
Telangana
ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి.హరీష్ రావు తన్నిరు
మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న  ‎ రేవంత్ రెడ్డి .. ముందు అంగన్ వాడీలకు...
By Ponnala Srinivasrao 2026-06-09 13:12:37 0 131
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 04:47:32 1 141
Telangana
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-04-28 13:09:15 0 463
Andhra Pradesh
మదనపల్లె: రిటైర్డ్ టీచర్ మెడలో బంగారు గొలుసు చోరీ.
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్...
By Pagadala Venkateswar 2026-01-28 10:02:51 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com