"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!

0
55

హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్ ఛాంపియన్‌షిప్ 2025-26లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ జట్ల మధ్య జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో తెలంగాణ జట్టు మొత్తం 12 పతకాలు సాధించి రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చింది.

ఈ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు 1 స్వర్ణ పతకం, 4 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. 

కఠిన పోటీ మధ్య క్రమశిక్షణ, పట్టుదలతో ఆడి విజయాలు సాధించిన క్రీడాకారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి. ఆనంద్ ఐపీఎస్ అభినందించి సత్కరించారు. 

రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పతక విజేతలకు అభినందనలు తెలిపిన డీజీపీ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పోటీల్లో కూడా తెలంగాణ పోలీసులు సత్తా చాటాలని ఆకాంక్షించారు.

పోలీస్ సిబ్బంది విధులతో పాటు క్రీడల్లోనూ రాణించడం గర్వకారణమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతాయని డీజీపీ పేర్కొన్నారు. 

తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మెల్యే కళాపై జడ్పీ ఛైర్మన్ ఫైర్
చీపురుపల్లి MLA కళా వెంకట్రావు ఇటీవల బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలను...
By Boiena Rajesh 2026-04-02 00:02:34 0 151
Andhra Pradesh
పుంగనూరు: శాంతినగర్లో లోపించిన పారిశుధ్యం
అన్నమయ్య జిల్లా , పుంగనూరు మండలం, భీమగాని పల్లి పంచాయతీ, శాంతినగర్ లో గత కొన్ని రోజులుగా కాలువలలో...
By Kothuru Murali 2026-05-14 13:14:39 0 41
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ సారధ్యంలో మహిళలకు ఎస్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*   తేనె, వర్మి, ప్రకృతి సాగుతో ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-16 07:32:03 0 165
Telangana
రాచకొండ : అంతర్ రాష్ట్ర గంజాయి దొంగల ముఠాను ఎస్ఓటి, ఎల్బీనగర్ జోన్ మరియు హయత్ నగర్, పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
  నిందితుల దగ్గర నుండి 166 కిలోల నిషిద్ధ గంజాయిని మరియు .50,00,000/- (రూపాయలు యాభై లక్షల...
By Sidhu Maroju 2025-06-20 16:03:52 0 1K
Andhra Pradesh
నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం.
పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే...
By Pagadala Venkateswar 2026-05-22 05:33:37 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com