కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ

0
217

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్, సోమవారం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, లాకప్ రూమ్, రిసెప్షన్, రికార్డులను పరిశీలించిన ఆమె, విధి నిర్వహణలో సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో చట్టవ్యతిరేక చర్యలు, అక్రమ రవాణా, డ్రగ్స్ వంటి వాటిపై నిఘా పెట్టాలని, రాత్రిపూట పెట్రోలింగ్ మరియు పిక్కెటింగ్‌ను కచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే, స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, మహిళలు మరియు బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో కబడ్డీ పోటీలు ఘనంగా ముగింపు.
మదనపల్లె జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం క్రీడాభారతి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి....
By Pagadala Venkateswar 2026-04-20 03:29:09 0 106
Andhra Pradesh
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
By Kothuru Murali 2026-05-09 15:02:41 0 117
Andhra Pradesh
నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత...
By Boya Dasthagiri 2026-04-10 01:20:52 0 156
Andhra Pradesh
100 రోజుల ప్రణాళిక,!! సెట్కూర్ CEO
కర్నూలు : వంద రోజుల ప్రణాళిక అమలు కావాలి: సెట్కూరు సీఈఓ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఏపీ క్యాంప్...
By Hari Krishna 2025-12-21 14:02:53 0 194
Andhra Pradesh
సుమన్ టి వి ప్రతినిధి జగదీష్ మృతి: మధుసూధన్ నాయుడు పరామర్శ
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ...
By Kothuru Murali 2026-03-02 12:36:50 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com