"యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఎక్సైజ్ దాడులు: భారీగా గంజాయి, వాహనాలు స్వాధీనం.|

0
71

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఆల్వాల్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. 

మల్కాజిగిరి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ ఆదేశాలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి పర్యవేక్షణలో ఆల్వాల్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ బృందం నిన్న సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించింది. 

నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద అక్రమంగా గంజాయి రవాణా, విక్రయాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ దాడుల్లో నిందితుల నుంచి 2.5 కేజీల ఎండు గంజాయితో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, మూడు ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాషన్ ప్లస్ బైక్, టీవీఎస్ ఎన్‌టార్క్, రెండు హోండా యాక్టివా స్కూటర్లతో కలిపి మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించగా, వారిలో బాలాజినగర్‌కు చెందిన భోనాకల్లూరి గణేష్, బల్లెపూళ్ల తరుణ్, కాప్రాకు చెందిన భిశ్వకర్మ విష్ణుకుమార్, వరంగల్ జిల్లా మేకలగట్టుకు చెందిన పుప్పాల చంద్రకాంత్, మెదక్ జిల్లా మొగదుంపల్లెకు చెందిన సత్యరాం అరవింద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కాగా కొత్తూరు విశాల్, ఆనంద్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన ఐదుగురు నిందితులను ఎక్సైజ్ అధికారులు రిమాండ్‌కు తరలించారు. 

ఈ విజయవంతమైన దాడుల్లో ఆల్వాల్ ఎక్సైజ్ సిఐ జి. చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ఎస్. కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
MB కెనాల్ నూతన వంతెన పనులు ప్రారంభం
చిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ...
By Nookapangu Manikanta 2026-05-23 12:13:30 0 31
Andhra Pradesh
కొండపి పోలీస్ స్టేషన్ లో సి.ఐ. తనిఖీ రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై వారెంట్లపై ఆకస్మిక సమీక్ష
కోండపి పోలీస్ స్టేషన్‌లో సి.ఐ. తనిఖీ: రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై ఆకస్మిక...
By Chennaiah Kati 2026-01-28 16:10:13 0 122
Telangana
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని MRO ధ్రువ కుమార్,...
By Nookapangu Manikanta 2026-04-22 12:52:17 0 110
Telangana
బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ
బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సామాన్య ప్రజలతో పాటు,...
By Sidhu Maroju 2025-06-09 10:35:07 0 1K
Telangana
నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి టు బిహెచ్కె పత్రిక సోదరులు
ఈరోజు 2 BHK ప్రెస్ క్లబ్ మిత్రులము అందరం కలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన దమ్మైగూడ మున్సిపల్...
By Vadla Egonda 2025-06-27 15:25:18 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com