"బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.. ప్రముఖుల వెల్లువ.|

0
85

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 

ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనాలు అందించగా, సీనియర్ నాయకులు కేకె (కే.కేశవరావు) తన ఆశీస్సులను అందజేశారు. 

చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మికి రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. 

శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, మరియు దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. 

వీరందరి సమక్షంలో విజయలక్ష్మి నూతన బాధ్యతలను స్వీకరిస్తూ మహిళా సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు తన వంతు కృషి చేస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మరియు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ....

గద్వాల విజయలక్ష్మి నాయకత్వంలో మహిళా కమిషన్ మరింత బలోపేతం అవుతుందని, మహిళల సమస్యల పరిష్కారంలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

మహిళల భద్రత, సాధికారత ధ్యేయంగా నూతన చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో కమిషన్ సరికొత్త మైలురాళ్లను అందుకుంటుందని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్ లు గొడుగులు శేష వస్త్రం రాతి పంచలోహ విగ్రహాలు రాయితీ
తిరుమల...   *హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి మ పంచలోహ...
By Rajini Kumari 2025-12-19 10:51:03 0 173
Andhra Pradesh
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.
చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-07 10:35:51 0 185
Telangana
మళ్ళీ ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
By Krishna Balina 2025-12-18 00:33:50 0 247
Andhra Pradesh
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-11 14:01:48 0 225
Andhra Pradesh
విజయ్‌కి మలేసియా పోలీసుల హెచ్చరిక
తమిళస్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ని మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:52:48 0 312
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com