"బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.. ప్రముఖుల వెల్లువ.|

0
222

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 

ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనాలు అందించగా, సీనియర్ నాయకులు కేకె (కే.కేశవరావు) తన ఆశీస్సులను అందజేశారు. 

చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మికి రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. 

శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, మరియు దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. 

వీరందరి సమక్షంలో విజయలక్ష్మి నూతన బాధ్యతలను స్వీకరిస్తూ మహిళా సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు తన వంతు కృషి చేస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మరియు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ....

గద్వాల విజయలక్ష్మి నాయకత్వంలో మహిళా కమిషన్ మరింత బలోపేతం అవుతుందని, మహిళల సమస్యల పరిష్కారంలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

మహిళల భద్రత, సాధికారత ధ్యేయంగా నూతన చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో కమిషన్ సరికొత్త మైలురాళ్లను అందుకుంటుందని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
నూతన ITDA PO గా లెనిన్
ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) గా Lenin Vatsal Toppo నియామకం
By Bheeshman King 2026-04-26 00:47:30 0 827
Andhra Pradesh
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ...
By Boya Dasthagiri 2026-03-24 23:59:00 0 305
Telangana
తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా...
By Ponnala Srinivasrao 2026-03-15 17:16:42 0 265
Andhra Pradesh
ఆరు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు.
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ ఫేజ్ శంకుస్థాపనతో పశ్చిమ ప్రజలకు ట్రాఫిక్ భారంనుండి విముక్తి :...
By John Baji 2026-01-04 04:02:10 0 229
Business & Finance
Heavy Rain Alert May Disrupt Delhi Business Activity
The India Meteorological Department (IMD) has issued a Yellow Alert for Delhi-NCR, forecasting...
By Navya Sree 2026-07-03 06:07:59 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com