"సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|

0
168

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు అమృత  నివాసంలో ప్రమాదవశాత్తు భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు, ఇంట్లోని సామాగ్రి, సర్వస్వం బూడిదయ్యాయి. చేతికందిన సర్వస్వం కోల్పోవడంతో అమృత  కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు లోనైంది.

ఈ ఘోర ప్రమాద విషయం తెలియగానే బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిశోర్ గౌడ్  తక్షణమే స్పందించారు. ఆయన వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని, కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. బాధితురాలైన అమృత గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ మరియు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

బాధిత కుటుంబం ఉన్న పళంగా రోడ్డున పడటంతో, అనిల్ కిశోర్ గౌడ్  మానవత్వంతో స్పందించి వారి అత్యవసర ఖర్చుల నిమిత్తం రూ. 5000 నగదును తక్షణ సాయంగా అందజేశారు. 

ప్రభుత్వం మరియు ప్రభుత్వం నుండి కూడా తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రభాకర్, విజయ్ శేఖర్, రాజు తదితరులు పాల్గొని బాధితులకు తమ సానుభూతిని తెలియజేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది....
By Pagadala Venkateswar 2026-02-17 07:14:22 0 159
Puducherry
Puducherry Strengthens Waste Management and Clean Cities
Puducherry continues to enhance waste management and clean city initiatives in 2026 by improving...
By Fathima Safa 2026-07-04 13:28:08 0 65
Telangana
విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే...
By Veeresh Kumar 2026-03-27 00:58:55 0 480
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 221
Andhra Pradesh
నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి...
By Benguluri Madhubabu 2026-03-15 08:29:48 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com