చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ

0
29

పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలోని కట్టమీద రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న చిరువ్యాపారులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, శామీర్ లాల్ మరియు సద్దాం హుస్సేన్ ల బృందం అండగా నిలిచింది. వాతావరణ మార్పుల వల్ల, ఎండ మరియు అకాల వర్షాల నుండి తమ వ్యాపారాలను, సరుకులను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేద వ్యాపారుల కష్టాలను గుర్తించి, చల్లా బాబు గారి సూచనల ప్రకారం వారికి ఉచితంగా టార్పాల్ (టార్పాలిన్) పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూరుల్లా, ముజాహిద్, మౌల, ఇర్ఫాన్ పాల్గొన్నారు. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యంగా ఈ సహాయం అందించబడింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో...
By Boya Dasthagiri 2026-04-13 12:54:23 0 122
Andhra Pradesh
ప్లాష్.. ప్లాష్ .. టాటా -ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు ఏసి బోగీ లు రెండు పూర్తి గా దగ్దం ఒక్కరు మృతి.
అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో  అగ్ని 🔥 🔥 ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు...
By Karapati Gopi 2025-12-29 03:10:53 0 259
Andhra Pradesh
జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పోలీస్ వారసులు
  చీరాల: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన చిన్నారులను అభినందించిన జిల్లా...
By Gadiyapudi Narendra 2026-01-27 16:24:52 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com