Palamooru rangareddy project

0
160

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. దీనితో పాటు జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల విషయంలో కూడా భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.

 

❇️ ముఖ్యమంత్రి గారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కీలకమైన సూచనలు చేశారు.

 

❇️ జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

 

❇️ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. 

 

❇️ ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, జి. మధుసూదన్ రెడ్డి గారు, టి. మేఘా రెడ్డి గారు, కె. రాజేశ్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, వీర్లపల్లి శంకరయ్య గారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల 50 డివిజన్లో కొనసాగుతున్న శుభ్రత - ప్రతి ఒక్కరి బాధ్యత కార్యక్రమం
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్...
By Avunoori Mahesh 2026-04-18 06:50:57 0 168
Andhra Pradesh
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*   *-నియోజకవర్గ యువనాయకులు మండలి...
By Rajini Kumari 2026-03-27 13:12:42 0 210
Andhra Pradesh
బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ
బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు మండలం, బోధనంపాడు...
By Chennaiah Kati 2026-07-02 12:30:33 0 37
Andhra Pradesh
ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ నాంది పలికిన బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం:- 26-03-2026   *ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్...
By Rajini Kumari 2026-03-26 13:46:05 0 219
Telangana
నిజామాబాద్ 39 వ దివిజన్‌లో కార్పొరేటర్ సమీక్ష
నిజామాబాద్.39 వడివిజన్‌లో ఈ రోజుఉదయం కార్పొరేటర్ మురళీకృష్ణ జీవితంలో ఉన్నసమస్యలను...
By Sadaq Sadaq 2026-02-21 02:57:45 0 212
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com