ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిశీలుకులు తేర్నెకల్ సురేంద్ర రెడ్డి గార్ల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు తో ర్యాలీ గా బయలు దేరి సోమప్ప సర్కిల్ కూడలి లో డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం,పెంచిన ఇందన ధరలను వెంటనే తగ్గించాలి అంటూ నినాదాల తో సోమప్ప సర్కిల్ కూడలి మార్ మోగింది.
అనంతరం మోకాళ్ళ పైన బైటయించి వినూత్నము గా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ
ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. రైతు పొలంలో ట్రాక్టర్ నడపాలన్నా భయం…
ఆటో డ్రైవర్ మీటర్ తిప్పాలన్నా నష్టం.మధ్యతరగతి కుటుంబం బైక్ బయటకు తీయాలన్నా ఆలోచించే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తాం… ప్రజలపై భారం వేయం. అంటూ హామీలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ రక్తం పీల్చే పాలన కొనసాగిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz