సైకిల్ పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే

0
351

భారత్ ఆవాజ్ న్యూస్ ఆలేరు 18   ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలు మళ్ళీ సైకిళ్లపై ప్రయాణించ వలసిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మరియు వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  సూచించారు రైతుల పండించిన ప్రతి గింజను సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కొనుగోలు కేంద్రాల్లో లారీలు తూకం అమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు రైతులకు ఇబ్బందులు కలుగుతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్.
Andhra Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday   విశాఖ జూ పార్క్‌ను...
By Pagadala Venkateswar 2026-01-29 11:48:51 0 159
Business & Finance
Keep Your Partnership Firm Compliant Every Year
Annual compliance helps partnership firms maintain legal and financial transparency while...
By Navya Sree 2026-07-14 05:58:26 0 41
Maharashtra
Maharashtra Expands Transport and Connectivity Network
Maharashtra continues to strengthen its transport and connectivity infrastructure through major...
By Fathima Safa 2026-06-30 09:17:28 0 49
Maharashtra
SAINT NIVRUTI MAHARAJ PALKHI BEGINS JOURNEY TO PANDHARPUR
Thousands of devoted Varkaris have embarked on the sacred annual Palkhi procession of Saint...
By Lokeshwari Panthadi 2026-07-01 07:58:32 0 63
Telangana
‎నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు....
By Ponnala Srinivasrao 2026-05-07 02:13:38 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com