"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|
హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్” కార్యక్రమంలో భాగంగా చిలకలగూడ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్కు వెంటనే స్పందించవద్దని సూచించారు.
అలాగే తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్ను ఓపెన్ చేయరాదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.
బ్యాంకు అధికారులు లేదా పోలీసులమని నమ్మబలికి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా నిర్ధారణ లేకుండా గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపరాదని స్పష్టం చేశారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులను ఫ్రీజ్ చేసి, కోర్టు ప్రక్రియ ద్వారా బాధితులకు తిరిగి అందించే అవకాశం ఉంటుందని పోలీసులు వివరించారు.
ఈ కార్యక్రమంలో చిలుకలగూడ ఏసీపీ కే. శశాంక్ రెడ్డి, ఎస్ఐ రాకేష్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
#Sidhumaroju
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz