"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|

0
88

హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్” కార్యక్రమంలో భాగంగా చిలకలగూడ పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌కు వెంటనే స్పందించవద్దని సూచించారు. 

అలాగే తెలియని వ్యక్తులు పంపే APK ఫైల్స్‌ను ఓపెన్ చేయరాదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPలను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.

బ్యాంకు అధికారులు లేదా పోలీసులమని నమ్మబలికి మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఎవరైనా నిర్ధారణ లేకుండా గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపరాదని స్పష్టం చేశారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి డబ్బులను ఫ్రీజ్ చేసి, కోర్టు ప్రక్రియ ద్వారా బాధితులకు తిరిగి అందించే అవకాశం ఉంటుందని పోలీసులు వివరించారు.

ఈ కార్యక్రమంలో చిలుకలగూడ ఏసీపీ కే. శశాంక్ రెడ్డి, ఎస్ఐ రాకేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
*అఖిల భారత యాదవ మహాసభ శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు కొండయ్య.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవ క్షత్రియ శంఖారావం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 11:11:58 0 779
Telangana
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్...
By Sidhu Maroju 2025-12-16 10:17:18 0 198
Andhra Pradesh
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన: ఫైర్ ఆఫీసర్ శివప్ప.
మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు...
By Pagadala Venkateswar 2026-02-27 04:05:22 0 92
Telangana
తెలంగాణలో రికార్డు స్థాయి వరి కొనుగోలు డ్రైవ్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో చరిత్ర సృష్టించేలా భారీ వరి కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం...
By Bharat Aawaz 2025-10-16 09:10:19 0 886
Andhra Pradesh
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
Ram Prasad Reddy: ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి 29-01-2026 Thu...
By Pagadala Venkateswar 2026-01-29 06:22:55 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com