"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”

0
138

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి పట్ల మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

జస్టిస్ చంద్రయ్య గారి మరణం న్యాయరంగానికి, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వర్గాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేసిన సంతాప సందేశంలో మాట్లాడుతూ, జస్టిస్ గుండ చంద్రయ్య న్యాయవ్యవస్థలో అత్యున్నత విలువలను పాటించిన వ్యక్తిగా చిరస్థాయిగా గుర్తుండిపోతారని తెలిపారు.

న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా జస్టిస్ చంద్రయ్య ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. 

సామాన్య ప్రజలకు న్యాయం అందించాలనే సంకల్పంతో ఆయన పనిచేశారని, ముఖ్యంగా బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత ఆదర్శనీయమని అన్నారు.

న్యాయపరమైన అంశాలపై విశేష పట్టు కలిగిన జస్టిస్ చంద్రయ్య గారు నిష్పక్షపాత ధోరణి, క్రమశిక్షణ, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

న్యాయరంగంలో ఆయన చేసిన సేవలు ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

జస్టిస్ చంద్రయ్య గారి మృతి వార్త తనను వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్న ఎంపీ ఈటల రాజేందర్, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

జస్టిస్ గుండ చంద్రయ్య అందించిన సేవలను తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు, న్యాయరంగ ప్రముఖులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
,కూటమి ప్రభుత్వం రైతన్నల కల,
- _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు - డోర్ టు...
By Boya Dasthagiri 2026-03-24 00:50:52 0 300
Andhra Pradesh
గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.
మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది....
By Pagadala Venkateswar 2026-04-13 05:42:03 0 88
Telangana
డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం
తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం...
By Sunka Santhosh 2026-04-24 15:00:01 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com