"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”

0
495

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి పట్ల మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

జస్టిస్ చంద్రయ్య గారి మరణం న్యాయరంగానికి, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే వర్గాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ విడుదల చేసిన సంతాప సందేశంలో మాట్లాడుతూ, జస్టిస్ గుండ చంద్రయ్య న్యాయవ్యవస్థలో అత్యున్నత విలువలను పాటించిన వ్యక్తిగా చిరస్థాయిగా గుర్తుండిపోతారని తెలిపారు.

న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో ఆయన అనేక కీలక తీర్పులు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా జస్టిస్ చంద్రయ్య ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. 

సామాన్య ప్రజలకు న్యాయం అందించాలనే సంకల్పంతో ఆయన పనిచేశారని, ముఖ్యంగా బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత ఆదర్శనీయమని అన్నారు.

న్యాయపరమైన అంశాలపై విశేష పట్టు కలిగిన జస్టిస్ చంద్రయ్య గారు నిష్పక్షపాత ధోరణి, క్రమశిక్షణ, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

న్యాయరంగంలో ఆయన చేసిన సేవలు ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు.

జస్టిస్ చంద్రయ్య గారి మృతి వార్త తనను వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్న ఎంపీ ఈటల రాజేందర్, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

జస్టిస్ గుండ చంద్రయ్య అందించిన సేవలను తెలంగాణ ప్రజలు, న్యాయవాదులు, న్యాయరంగ ప్రముఖులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
జెర్రీ పోతుల గూడెం AITUC కమిటీ ఎన్నిక
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-04-29 14:26:37 0 151
Andhra Pradesh
ఓటరే ప్రజాస్వామ్యానికి మూలం
ఓటరే ప్రజాస్వామ్యానికి మూలం ఈరోజు ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పాల్గొనడం...
By Chennaiah Kati 2026-06-19 17:38:18 0 76
Andhra Pradesh
చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు
తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ...
By Boiena Rajesh 2026-03-01 03:28:27 0 196
Andhra Pradesh
పేదల కళ్ళలో సంక్రాంతి వెలుగులు సంక్రాంతి కానుకగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు
*పత్రికా ప్రకటన* *విజయవాడ,13.01.2026*    *పేదల కళ్ళలో సం'క్రాంతి' వెలుగులు...*...
By Rajini Kumari 2026-01-13 15:54:27 0 198
Telangana
నేరేడు పండ్లు కాశాయి.. ఇక వర్షాలు కష్టమేనా?"|
"నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే వర్షాలు పడవా? అపోహలపై నిపుణుల స్పష్టీకరణ" హైదరాబాద్ : ఈ ఏడాది పలు...
By Sidhu Maroju 2026-06-24 12:34:07 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com