దళారులను నమ్మి మోసపోవద్దు......!

0
133

*దళారులను నమ్మి మోసపోవద్దు....*

 - *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*

 - *బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్*

భారత్ అవాజ్ న్యూస్: 15 మే రోజున దుగ్గొండి మండలం బొబ్బర్పల్లె గ్రామపంచాయతీ రైతులు దళారులను నమ్మి మోసపోవకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్ సూచించారు. శుక్రవారం బోబ్బరోనిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ప్రారంభించారు. అనంతరం కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి అధికారుల సూచనలు పాటించాలని కోరారు. కొనుగోలు కేంద్రంలో 2389 సన్న రకం, 2369 దొడ్డు రకం ధరతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గాజుల శ్యామ్, ఏపీఎం రమేష్, ఏఈఓ రాజేష్, సిఏ కొనుకటి కృష్ణవేణి, ఉపసర్పంచ్ కొనుకటి అరుణ, వార్డు సభ్యులు రాధారపు నరేష్, గోంగూర కోటి, లలిత, భాషబోయిన రాజు, మయూరి విఓ అధ్యక్షురాలు బొల్లం సావిత్రి, మాజీ సర్పంచ్లు ఎర్ర ఆది రెడ్డి, రైతులు కోడూరి రాజేందర్, కొలిపాక చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము....

Search
Categories
Read More
Haryana
Gurugram Hosts 11th BRICS Energy Ministers Meeting
Under India’s 2026 BRICS Chairship, Gurugram successfully hosted the landmark 11th BRICS...
By Lokeshwari Panthadi 2026-06-27 05:18:49 0 39
Andhra Pradesh
నేడు గిరిపుత్రుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
నేడు గిరిపుత్రుల మధ్య జనసేన 13 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం    జనసైనికులకు, జనసేన...
By Rajini Kumari 2026-03-14 11:38:53 0 204
Telangana
భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే
జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు        ...
By Bheeshman King 2026-07-03 12:28:03 0 73
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం...
By Pagadala Venkateswar 2026-06-26 03:13:20 0 45
Andhra Pradesh
మదనపల్లి లో అనుమతుల్లేని ఎగ్జిబిషన్‌పై నిరసన.
మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సిగ్నేచర్...
By Pagadala Venkateswar 2026-04-21 13:44:16 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com