భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే

0
70

జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు                                                                                                                                                                                                                  

మహబూబాబాద్, జూలై.03:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే (భూ భారతి) ప్రక్రియపై జిల్లావ్యాప్తంగా  పలు మండలాల్లో అధికారులు ప్రజలకు మరియు రైతులకు అవగాహన సదస్సులు (గ్రామసభలు) నిర్వహిస్తున్నారని, ఎంతో కాలంగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమం చేపట్టిందని జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు తెలిపారు. 

దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా లోని వివిధ మండలాలలో  భూ భారతి - భూముల రీ సర్వేపై అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం   జిల్లాలో 70 గ్రామాలు రీ సర్వే జరుపుటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దానిలో భాగంగా రీ సర్వే పై అవగాహన కల్పించుటకు గ్రామ సభలు నిర్వహించుట జరుగుతుందని అన్నారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీ సర్వే ద్వారా ప్రతి రైతుకు సర్వే నెంబర్ నమోదుచేసి (land parcel map), భూమి కమతాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తామని, గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే రీ సర్వేలో సరిచేసుకోవచ్చని ఎలాంటి వివాదాలు లేకుండా చేసి భూమికి భూధార్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

సర్వేనిర్వహించే తేదీల్లో రైతులు అందుబాటులో ఉండి ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞ ప్తి చేశారు. రీ సర్వే ద్వారా గ్రామ, భూ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, రహదారులతో పాటు ఇతర ప్రజా అవసరాల భూములను కచ్చితంగా రీ సర్వే చేయను న్నట్లు తెలిపారు. రీ సర్వే కార్యక్రమం ప్రజలకు మెరుగైన భూ హక్కులను కల్పించేందుకు ఉద్దేశించిందని  ప్రజల సహకారం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Tamilnadu
National Green Tribunal, Beach Pollution, Environmental Law, Waste Management, Coastal Conservation, India
The meteorological department has officially issued a weather alert, forecasting chances of rain...
By Tejaswini Komanduru 2026-06-15 04:36:43 0 410
Andhra Pradesh
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు.
డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు Andhra Chandrababu Naidu Orders...
By Pagadala Venkateswar 2026-05-30 05:19:43 0 61
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:22:51 0 218
Telangana
అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో  భారత్ ఘన విజయం..
  భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్‌పై...
By Yadamma Raju Gajapaga 2026-02-06 15:02:30 0 462
Andhra Pradesh
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*     ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...
By Rajini Kumari 2025-12-22 08:17:54 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com