చీరాల ఎగ్జిబిషన్‌లో ధరల 'దోపిడీ'.. కలుషిత ఆహారంతో ప్రజల ఆరోగ్యం విలవిల!

0
246

చీరాల

పాత పట్టణంలోని పాత భవాని థియేటర్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 'అనిత ట్రేడ్ ఫెర్ రోబోటిక్ ఫిష్ టన్నల్' ఎగ్జిబిషన్ సందర్శకుల పాలిట శాపంగా మారింది. వినోదం పేరుతో యాజమాన్యం సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతూ,మరోపక్క నాణ్యత లేని ఆహారంతో ప్రాణాలతో చెలగాటమాడుతోందని సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ నుంచి ఆటల వరకు అంతా వసూళ్లే

ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్, పార్కింగ్ ధరల దగ్గరి నుంచే వసూళ్లు మొదలవుతున్నాయి. లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ స్టాళ్లలో నాణ్యత లేని వస్తువులను సైతం 'ఫిక్స్‌డ్ రేట్' పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక వినోదం కోసం ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ వంటి వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో రైడ్‌కు భారీగా వసూలు చేస్తున్న యాజమాన్యం, కనీసం పది నిమిషాలు కూడా తిప్పకుండా కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ముగించేస్తూ పిల్లలను, పెద్దలను దించేస్తున్నారు.

రంగులమయమైన 'కలుషిత' ఆహారం

ఎగ్జిబిషన్‌లోని ఫుడ్ కోర్టుల పరిస్థితి చూస్తే ప్రజలు హడలిపోతున్నారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా వంటి పదార్థాలలో విపరీతమైన రంగులు కలుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. వంట చేసే ప్రదేశంలో కనీస శుభ్రత లేకపోవడమే కాకుండా, ఈగలు ముసురుతున్న వాతావరణంలోనే వంటలు సాగుతున్నాయి. అధిక ధరలు పెట్టి కొన్నా కూడా కనీస నాణ్యత లేకపోవడంతో ప్రజలు వేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ నడిబొడ్డున ఇంత దారుణంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నా, అనుమతులిచ్చిన అధికారులు పర్యవేక్షించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

 ధరల నియంత్రణ ఏది

   అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, ఎగ్జిబిషన్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని, అధిక వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చీరాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Mnrega పేరు మార్పు స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి రోజు వైఎస్ షర్మిల రెడ్డి Apcc చీఫ్
Scroll    విజయవాడ    వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్    -...
By Rajini Kumari 2025-12-18 07:45:22 0 181
Rajasthan
Rajasthan Expands Digital Governance and Public Services
Rajasthan is advancing digital governance by expanding online public services, strengthening...
By Fathima Safa 2026-06-30 12:04:05 0 53
Telangana
శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.
సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్...
By Sidhu Maroju 2025-10-09 07:37:13 0 250
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...
By Gujile Ramu 2026-04-23 12:42:07 0 197
Punjab
Punjab’s Irrigation Milestone: Canal Water Usage Soars
The Punjab government has achieved a significant milestone in its commitment to sustainable...
By Lokeshwari Panthadi 2026-06-29 08:53:27 0 68
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com