"తెలంగాణలో కొత్త పార్కింగ్ షాక్.. అడ్డగోలుగా పార్క్ చేస్తే బండి వేలానికే!

0
248

హైదరాబాద్ : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త పార్కింగ్ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ నూతన విధానం ప్రకారం రహదారులపై, నో-పార్కింగ్ జోన్లలో అడ్డగోలుగా నిలిపే వాహనాలతో పాటు, అకస్మాత్తుగా పాడైపోయి రోడ్డుపైనే ఉండిపోయే బ్రేక్‌డౌన్ వాహనాలను కూడా అధికారులు వెంటనే టోయింగ్ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక యార్డులకు తరలిస్తారు. 

అలా స్వాధీనం చేసుకున్న వాహనాలను ముప్పై నుండి నలభై ఐదు రోజుల లోపు యజమానులు అన్ని రకాల బకాయిలు చెల్లించి క్లియిమ్ చేసుకోకపోతే, ప్రభుత్వం ఆ వాహనాలను నిస్సంకోచంగా బహిరంగ వేలం వేసి విక్రయిస్తుంది.

అయితే అధికారులు పట్టుకున్న వాహనాన్ని తిరిగి సొంతం చేసుకోవడం వాహనదారులకు అంత సులువు కాబోదు. సదరు యజమాని జరిమానాతో పాటు వాహనాన్ని తరలించినందుకు అయ్యే టోయింగ్ ఛార్జీలను, యార్డులో భద్రపరిచినందుకు గానూ రోజువారీ పార్కింగ్ ఫీజులను కూడా భరించాల్సి ఉంటుంది. 

వీటితో పాటు సదరు వాహనంపై గతంలో ఉన్న అన్ని పాత ఈ-చలాన్లను పూర్తిగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్డు టాక్స్ బకాయిలు చెల్లించి, ప్రస్తుతానికి చెల్లుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను అధికారులకు సమర్పించిన తర్వాతే వాహనాన్ని అప్పగిస్తారు. 

ఈ విధానం వల్ల భవిష్యత్తులో సొంత పార్కింగ్ స్థలం ఉన్నవారికే వాహనాలు కొనుగోలు చేసే అర్హత లభించేలా నిబంధనలు మారనున్నాయి.మరోవైపు ప్రభుత్వం కేవలం జరిమానాలకే పరిమితం కాకుండా, నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్‌ వంటి ప్రధాన రద్దీ ప్రాంతాల్లో, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ ఛార్జింగ్ సదుపాయాలతో కూడిన మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని యోచిస్తోంది. 

ప్రస్తుతం రవాణా శాఖ సిద్ధం చేసిన ఈ ముసాయిదా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. త్వరలోనే దీనిని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా చట్టబద్ధంగా అమలు చేయనున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్అకాడమీ, యంగ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాలవ్యతిరేక దినోత్సవ ర్యాలీ.
కరీంనగర్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన...
By Thalakokkula Sadanandam 2026-06-26 05:24:05 0 143
Telangana
దంతేపల్లి గ్రామంలో సిసి రోడ్ పనులు ప్రారంభం...
రామయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బుధవారం రోడ్డు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి...
By Katiyala JeevanRaj 2026-04-08 10:36:07 0 325
Andhra Pradesh
వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం
వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక,...
By Ratna Sekhar 2026-03-11 07:43:33 0 1K
Assam
Mass Protests Erupt in Assam Over Delay in Tribal Council Elections
Assam - Hundreds of people from the Sonowal Kachari tribal community took to the streets in...
By Citizen Rights Council 2025-08-02 12:42:18 0 2K
Andhra Pradesh
సైబర్ నేరాల గురించి హెచ్చరిక తస్మాత్ జాగ్రత్త
అందరికీ జాగ్రత్త 🚨   ఏలురు జిల్లా ఎస్పీ, శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపిఎస్, గారు సైబర్...
By Rajini Kumari 2025-12-25 10:44:28 0 279
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com