ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన.

0
96

 

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన

Andhra

AP Government Mulls Work From Home Option Following Modis Call

పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ హెచ్చరిక

పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు

ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంపైనా ఏపీ సర్కార్ యోచన

త్వరలో మార్గదర్శకాల రూపకల్పన.. కేబినెట్‌లో చర్చకు అవకాశం

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది.

 

ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా ఉంటుందని, ప్రజలందరూ పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఇంధనం వాడకాన్ని తగ్గించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఒక పరిష్కారంగా ప్రస్తావించారు.

 

ప్రధాని సూచనల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. ఏపీలో ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ప్రపంచమంతా ఇంటి నుంచే పనిచేసే రోజులు రాబోతున్నాయని, దానికి అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం అనవసర ప్రయాణాలు తగ్గించి, టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

 

చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి పనిచేసేందుకు వీలున్న విభాగాలు, కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. కొందరికి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్, మరికొందరికి హైబ్రిడ్ విధానంలో (కొన్ని రోజులు ఇల్లు, కొన్ని రోజులు ఆఫీస్) పనిచేసే అవకాశాన్ని కల్పించే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చించి, స్పష్టమైన మార్గదర్శకాలతో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
5 జి ఫోన్లు పంపిణీ !!
కర్నూలు : కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో  అంగన్వాడీ టీచర్లకు శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను...
By Hari Krishna 2025-12-15 15:15:29 0 251
Andhra Pradesh
సీఎం చంద్రబాబును కలిసిన గద్దె రామ్మోహన్ ఎంపీ కేసినేని
*విజ‌య‌వాడ‌* *25-12-2025*   *సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్,...
By Rajini Kumari 2025-12-25 07:43:31 0 227
Andhra Pradesh
ఇంధన సరఫరాలో కొరత లేదు.. ఆందోళన అవసరం లేదు: జేసీ.
మదనపల్లిలో డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ...
By Pagadala Venkateswar 2026-04-27 06:01:05 0 101
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్...
By Pagadala Venkateswar 2026-03-07 05:59:59 0 153
Andhra Pradesh
పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఈ నెల 10వ తేదీన పిఠాపురంలో పర్యటించనున్నారు. అక్కడ...
By Pagadala Venkateswar 2026-01-06 07:43:30 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com