ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే!

0
61

ఏపీలో టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి

సుప్రీంకోర్టు ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

సీనియారిటీ జాబితాలో చేర్చనున్నటెట్ మార్కుల వివరాలు 

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్ విద్యా పర్యటన అవకాశం

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఉత్తమ ఉపాధ్యాయులను ప్రోత్సహించే దిశగా వారిని ఫిన్లాండ్ పర్యటనకు పంపాలని నిర్ణయించింది.

 

ప్రమోషన్లకు కొత్త నిబంధనలు

పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, ఇకపై స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు టెట్ అర్హతను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలు, గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు సర్వీసులో ఎప్పుడు చేరినప్పటికీ, ప్రమోషన్ సమయంలో టెట్ అర్హత సాధించి ఉండాల్సిందే.

 

ఈ నిబంధన అమలు కోసం స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల సీనియారిటీ జాబితాలో టెట్‌కు సంబంధించి ప్రత్యేకంగా ఒక కాలమ్‌ను చేర్చనున్నారు. ఇందులో ఉపాధ్యాయుడు ఏపీటెట్ లేదా సీటెట్‌లో అర్హత సాధించారా లేదా, ఏ పేపర్‌లో అర్హత పొందారు, సాధించిన మార్కులు, సబ్జెక్టు, మాధ్యమం వంటి వివరాలను నమోదు చేస్తారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు గతేడాది టెట్ రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

 

ఉత్తమ టీచర్లకు ఫిన్లాండ్ అవకాశం

మరోవైపు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న 31 మంది టీచర్లకు, సీమ్యాట్ కాంట్రాక్ట్ లెక్చరర్ సతీష్ రెడ్డికి ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఫిన్లాండ్‌లోని ప్రాథమిక విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు వీరిని ప్రభుత్వ ఖర్చులతో అక్కడికి పంపుతోంది. ఈ బృందంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా కూడా ఉంటారు. ఆగస్టు 17 నుంచి 26 వరకు వీరు ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కును సందర్శించి అక్కడి విద్యావిధానాన్ని పరిశీలిస్తారు. పర్యటన ముగిసిన వారం రోజుల్లోగా ఏపీలో అమలు చేయడానికి వీలైన అంశాలతో ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఈ బృందాన్ని ఆదేశించారు

Search
Categories
Read More
Andhra Pradesh
అజిత్ సింగ్ నగర్ లోని భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా      అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పినపాల లిఖిత అనే మహిళ...
By Rajini Kumari 2026-02-10 10:20:27 0 133
Andhra Pradesh
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమమే అన్ని వర్గాలకు క్షేమదాయకంగా మారిందని మాచర్ల శాసన సభ్యులు...
By John Baji 2026-01-01 02:22:56 0 129
Andhra Pradesh
టిడిపి సీనియర్ కార్యకర్త నాగరాజుకు నివాళులర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ఉదయం టిడిపి సీనియర్ కార్యకర్త తరుగు నాగరాజు మృతి విషయం తెలుసుకుని మాసాపేట నందు వారి...
By Benguluri Madhubabu 2026-02-07 04:02:39 0 215
Telangana
TYPHOID OUTBREAK IN GUJARAT
The recent typhoid outbreak in Gandhinagar, with over 150 people hospitalised and children losing...
By Terli Ashok 2026-01-25 09:31:18 0 180
Andhra Pradesh
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.
TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు 02-02-2026...
By Pagadala Venkateswar 2026-02-02 09:56:32 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com