ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు.. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్!.

0
45

సెప్టెంబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక

ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా

వార్డుల విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియనుండటంతో, సెప్టెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త ఏడాదికి నూతన పాలకవర్గాలు కొలువుదీరేలా చర్యలు చేపడుతోంది.

 

ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిన్న అమరావతిలో కీలక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని, ఇది జూన్ 26 నాటికి పూర్తికానుందని అధికారులు తెలిపారు. మరోవైపు, బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా జులైలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13,291 పంచాయతీలకు ఓటర్ల జాబితాలు ప్రచురించినట్టు సమాచారం. ఈ ఏర్పాట్లన్నీ సకాలంలో పూర్తి చేసి, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావిస్తోంది.

Search
Categories
Read More
Telangana
కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
హైదరాబాద్‌: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
By Sidhu Maroju 2026-03-30 12:15:48 0 119
Andhra Pradesh
పుంగనూరు:చంద్రబాబును కలిసిన చల్లా బాబు.
శనివారం నగరిలో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం...
By Kothuru Murali 2026-01-24 12:16:03 0 141
Andhra Pradesh
ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేయొద్దు: శ్రీమతి బుట్టా రేణుక
* – చేనేతల అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు, స్వావలంబనను కాపాడాలి. * – మాచాని సోమప్ప గారి...
By Boya Dasthagiri 2026-03-27 14:23:11 0 276
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న...
By Sidhu Maroju 2026-02-21 15:08:02 0 174
Andhra Pradesh
ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు
కృష్ణా   *ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్...
By Rajini Kumari 2026-05-16 14:56:14 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com