ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు.

0
82

ఏపీ హైకోర్టు సీజేకు జడ్ ప్లస్ భద్రత.. గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు ఆదేశాలు

13-05-2026 Wed 08:36 | Andhra

Justice Lisa Gill Gets Z Plus Security in Andhra Pradesh

సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం

సీజే కాన్వాయ్‌కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

విజయవాడ, గుంటూరు పోలీసులకు డీజీపీ నుంచి కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు 'జడ్ ప్లస్' కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్‌కు ముప్పు పొంచి ఉందన్న అంచనాలు, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన విజయవాడ, గుంటూరు పోలీసు కమిషనరేట్ల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు. రోజూ విజయవాడలోని తన నివాసం నుంచి అమరావతిలోని హైకోర్టుకు ప్రయాణించే మార్గంలో జస్టిస్ లీసా గిల్ కాన్వాయ్‌కు 'గ్రీన్ ఛానల్' ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. దీనివల్ల ఆమె ప్రయాణ సమయంలో కాన్వాయ్‌ ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.

 

జస్టిస్ లీసా గిల్ 2026 ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Issues Malaria Alert After Fatal Outbreak
The Jharkhand government has declared a statewide health alert following the tragic death of four...
By Lokeshwari Panthadi 2026-07-02 04:52:17 0 49
Telangana
జిహెచ్ఎంసి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం - పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-11-25 12:22:13 0 180
Telangana
డ్రగ్స్ మరియు నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం : డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్
మంచిర్యాల జిల్లా : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా ఈ రోజు...
By Avunoori Mahesh 2026-06-04 15:03:44 0 123
Andhra Pradesh
సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....   ఎంతో ప్రసిద్ధి...
By BABJI DADALA 2025-12-29 12:26:34 0 363
Andhra Pradesh
Chandrababu Naidu: ఇది మహాపచారం... గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం: కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ఇది మహాపచారం... గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం:...
By Pagadala Venkateswar 2026-02-24 09:56:31 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com