బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ఇంచార్జీల వివరాలు

0
110

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం సుధీర్ఘంగా జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాల పై చర్చించి సమావేశం నిర్ణయాలు తీసుకున్నది.

‎ముఖ్యాంశాలు :

‎1) ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)  చేపట్టిన SIR ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని డిజిటలైజేషన్ పద్దతిలో జరపాలని, బిఆర్ఎస్ ప్రార్టీ ప్రధాన కార్యదరర్శుల సమావేశం అభిప్రాయ పడింది. 

‎2) ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ సమన్వయ కర్తను నియమించాలని  నిర్ణయించడం జరిగింది.

‎3)  ప్రతీ మండలాని, మున్సిపల్ బాడీల వారిగా, ‘సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను  రెండు మూడు రోజుల్లొ నియమించాలని నిర్ణయం జరిగింది.

‎4) డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున, రాష్ట్రంలో వున్న 35,655 పోలింగ్ బూత్ లలో., బూత్ కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణాతరగతులు నిర్వహించాలని , ఈ సందర్భంగా డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల పై శిక్షణ ఇవ్వాలని సమావేశం అభిప్రాయ పడింది.

‎5)  పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్దతిలో చేపట్టేందుకు తగిన  శిక్షణా శిభిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని నిర్ణయం జరిగింది

‎సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించబడిన ఇంచార్జీల వివరాలు :

‎ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు- శ్రీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎంఎల్సీ, ప్రధాన కార్యదర్శి.

‎జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలు – శ్రీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి 

‎ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలు –

‎శ్రీమతి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి 

‎జనగాం, హనుమకొండ, వరంగల్ జిల్లాలు - శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి. 

‎మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలు-  శ్రీ గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.

‎నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు- శ్రీ గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.

‎మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు- శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.

‎ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలు-  శ్రీ రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.

‎వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు- శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.

‎మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు — శ్రీ మహమూద్ అలీ, మాజీ మంత్రి

‎గద్వాల్,నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాలు— శ్రీ మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి

‎మేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి జిల్లాలు — శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్

‎హైదరాబాద్ జిల్లా— శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

‎నల్గొండ, సూర్యాపేట జిల్లాలు — శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు...
By Kothuru Murali 2026-01-25 12:06:20 0 183
Telangana
ఆసిఫాబాద్‌ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ తక్షణ ఆర్థిక సహాయం అందజేత
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ : కొమురం భీం...
By Chunarkar Jagadeesh 2026-06-04 12:23:49 0 271
Andhra Pradesh
నేడు విజయవాడ క్యాంప కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి
ఈరోజు రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ప్రజా...
By Benguluri Madhubabu 2026-01-27 12:40:18 0 266
Andhra Pradesh
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-27 05:44:02 0 203
Andhra Pradesh
జీవించింది 55 ఏళ్ళు అయినా తరతరాలకు నిలిచిపోయే పేరు రఫీ సాబ్
జీవించింది_55_ఏళ్ళే_అయినా_తరతరాలకు నిలిచి_పోయే_పేరు_రఫీ_సాబ్_ది  ...
By Rajini Kumari 2025-12-24 10:47:11 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com