బండి సంజయ్ గారూ.. ‎మీ ధర్మం ఏమైంది? ఈ దేశం ఎటు పోతోంది? : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి సూటి ప్రశ్న

0
155

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదని శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రతిరోజూ దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పే కేంద్రమంత్రి, తన కుమారుడు అఘాయిత్యం చేస్తే ఏమీ జరగలేదని వెనకేసుకురావడం దారుణమన్నారు. పైగా ఇంత జరిగాక కూడా ఆయన ఏమీ ఎరుగనట్లు ప్రధాని సభలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. 'బేటీ బచావో' అంటూ నినాదాలిస్తూ నీతి వాక్యాలు పలికే బీజేపీ నేతలు, తమ కేంద్రమంత్రి ఒక మైనర్ ఆడపిల్ల పట్ల చేస్తున్న కుట్రలను ఖండించాలన్నారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తాయని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, ఈ ఘటనపై న్యాయం కోసం ఉద్యమించి, దేశవ్యాప్తంగా అన్నిపక్షాల మద్దతు కూడగడుతుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హెచ్చరించారు.

Search
Categories
Read More
Bharat Aawaz
🚨 ALERT: Major Rule Changes Effective From July 1 – What You Need to Know
Starting July 1, 2025 (Tuesday), several important changes are coming into effect across...
By Bharat Aawaz 2025-07-01 09:35:21 0 1K
Andhra Pradesh
చోరీ కేసులో నిందితులకు ఒకొక్కరికి 15 నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి.ముఖేష్ కుమార్ తీర్పు :
➡️ చోరీ కేసులో నిందితులకు ఒకొక్కరికి 15 నెలల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు...
By Chennaiah Kati 2026-06-18 08:24:53 0 73
Andhra Pradesh
టీటీడీ దర్శనం టికెట్స్ సేవలు విడుదల
*🙏టిటిడి దర్శనం టికెట్స్, సేవలు విడుదల🙏*   🌹మార్చి-2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత...
By Rajini Kumari 2025-12-16 09:53:02 0 171
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 110
SURAKSHA
Supratim Sarkar: The IPS Officer Redefining Modern Policing
A Guardian of Law with a Pen of Insight: The IPS Officer Who Bridges Service and Society The...
By Kalaga Sailaja 2026-07-17 09:51:06 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com