"నిషేధిత పత్తి విత్తనాల స్మగ్లింగ్‌పై మల్కాజిగిరి పోలీసుల భారీ ఆపరేషన్.|

0
123

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : శామీర్‌పేట్ పరిధిలో నిషేధిత బీటీ-3 (BG-III HP వెరైటీ) పత్తి విత్తనాల అక్రమ రవాణా వ్యవహారాన్ని ఎస్‌వోటీ కంటోన్మెంట్ టీమ్ ఛేదించింది. 

వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శామీర్‌పేట్ పోలీసులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 100 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు శామీర్‌పేట్ ORR ఎగ్జిట్ నెంబర్-07 వద్ద తనిఖీలు చేపట్టిన అధికారులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న దాసరి శ్రీనివాసరావు (58)ను పట్టుకున్నారు. 

గుంటూరు జిల్లా చెబ్రోలు గ్రామానికి చెందిన అతను వ్యవసాయం పేరుతో నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలను రైతులు, ఎరువుల దుకాణాలకు అధిక లాభాల కోసం విక్రయించేందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

అతని వద్ద ఉన్న రెండు సంచుల్లో మొత్తం 100 కిలోల బీటీ-3 విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ విత్తనాలను అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అధిక ధరలకు అమ్మేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. 

ఈ వ్యవహారంలో దాసరి సూరిబాబు అనే మరో వ్యక్తి కూడా భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

పోలీసుల దర్యాప్తులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే నిందితుడు గతంలో వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన నకిలీ విత్తనాల కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

వ్యవసాయ నిపుణుల హెచ్చరిక ప్రకారం, నిషేధిత మరియు నకిలీ పత్తి విత్తనాల వాడకం వల్ల నేల నాణ్యత దెబ్బతినడంతో పాటు పంటలు విఫలమై రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు.

ఈ ఘటనపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS), సీడ్స్ యాక్ట్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, సీడ్స్ కంట్రోల్ ఆర్డర్-1983 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఆపరేషన్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి ఐపీఎస్ పర్యవేక్షణలో, డీసీపీలు, ఎస్‌వోటీ అధికారులు, శామీర్‌పేట్ పోలీసులు మరియు వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.
ప్రత్తిపాడు మండలం,కోయవారిపాలెం గ్రామం నందు ఆర్ & బి రోడ్డు నుండి వినాయకుని గుడి వరకు సిసి...
By John Baji 2026-01-02 14:16:22 0 160
Andhra Pradesh
మదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన...
By Pagadala Venkateswar 2026-01-26 05:33:29 0 134
Andhra Pradesh
అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణి
విజయవాడ    అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన...
By Rajini Kumari 2026-05-15 12:15:46 0 71
Andhra Pradesh
మిలియన్‌ ప్లస్‌ సిటీగా గుంటూరు.. 18 గ్రామాల విలీనానికి కౌన్సిల్ ఆమోదం.
గుంటూరు నగరాన్ని మిలియన్ ప్లస్ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మిలియన్...
By John Baji 2025-12-28 04:02:14 0 151
Telangana
లక్షేటిపేట వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం...
By Avunoori Mahesh 2026-05-08 15:03:19 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com