10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ

0
262

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని,ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు.చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతిలో 31మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు పాస్ అయినారు.సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో 30 మంది పదవ తరగతి పాసైన విద్యార్థులకు సీల్డ్ తో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు ప్రోత్సకాలను సోమవారం సొసైటీ బ్యాంకు లో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కఠోర దీక్ష,నిరంతర సాధనను అలవర్చుకొని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.విద్యార్థుల ఎదుగుదలలో కుటుంబం,కుటుంబాల ఎదుగుదలలో దేశం ఉండాలని కోరారు.ఏ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ సిబ్బంది,స్కూల్ చైర్మన్ మార్కపూడి జాన్ కోటయ్య,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 161
Andhra Pradesh
పుంగనూరు: పోలీసుల అదుపులో నిందితుడు కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మార్కెట్ యార్డు వద్ద శనివారం సాయంత్రం టమాటా లోడ్ కోసం వచ్చిన ఇద్దరు...
By Kothuru Murali 2026-05-16 16:01:07 0 89
Telangana
ఆసిఫాబాద్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్): ఆసిఫాబాద్, మే 25:...
By Chunarkar Jagadeesh 2026-05-25 10:34:10 0 453
Andhra Pradesh
రూ.54.13 లక్షలతో చిన్న గుడిపాడు గ్రామం అభివృద్ధి శుభరంభం....
రూ.54.13 లక్షలతో చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధికి శుభారంభం...   దోర్నాల మండలం,...
By Chennaiah Kati 2026-01-31 14:24:34 0 218
SURAKSHA
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...
By Kalaga Sailaja 2026-06-25 09:50:50 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com