ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్గా అమలవుతున్నాయని పేర్కొన్నారు.
అంబారుపేట గ్రామంలో గత రెండేళ్ల కాలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రూ.4.5 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధి, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంబారుపేట గ్రామ శ్రీ సత్తెమ్మ తల్లి దేవస్థాన కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz