ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.

0
95

ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం

భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ నిర్ణయం 

తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మాత్రం మినహాయింపు

ఖరీఫ్ సాగును ముందుగానే చేపట్టాలని రైతులకు వ్యవసాయశాఖ సూచన

ఏపీ ప్రభుత్వం భూగర్భ జలాల పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటిన 7 జిల్లాల్లోని 258 గ్రామాల్లో కొత్తగా బోర్ల తవ్వకాలను పూర్తిగా నిషేధించింది. అయితే, ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే చేతి బోర్లకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చింది. ఈ గ్రామాల్లో వ్యవసాయ, వాణిజ్య అవసరాలకు కొత్త బోర్లు వేయడంతో పాటు ఇసుక తవ్వకాలపై కూడా నిషేధం విధిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

 

శ్రీకాకుళంలో 76, ప్రకాశంలో 91, పల్నాడులో 20, చిత్తూరులో 8, అనంతపురం జిల్లాలో 14, శ్రీసత్యసాయి జిల్లాలో 39, కడప జిల్లాలో 10 గ్రామాల్లో నీటి వినియోగం పరిమితికి మించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు రైతులను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమైంది. ఈ ఏడాది ప్రాజెక్టుల నుంచి నీటిని ముందుగా విడుదల చేస్తుండటంతో, ఖరీఫ్ సాగును కూడా ముందుగానే ప్రారంభించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్‌ జిలానీ రైతులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

ముందస్తు సాగు వల్ల పంట కోత సమయానికి ప్రకృతి వైపరీత్యాల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆయన రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి రైతు 'ఫార్మర్స్‌ యాప్‌' డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని, ఏపీ ఎయిమ్స్‌ యాప్‌ను రోజూ గమనించాలని సూచించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నుంచి గతేడాది కంటే ముందే నీటిని విడుదల చేశారని, ఈ నెల 25లోగా వరి నాట్లు పూర్తి చేసేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్‌ఫుల్‌నెస్’ మెడిటేషన్: ఎస్పీ.
అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-05-22 05:06:53 0 90
Telangana
ఎస్ఓటి పోలీసుల దాడులు, రెండు లక్షల విలువ చేసే క్రాకర్స్ సీజ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి నగర్ కాలనీలోనీ ఓ ఇంట్లో...
By Sidhu Maroju 2025-10-15 13:48:12 0 275
Uncategorized
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom Veteran...
By BMA ADMIN 2025-05-22 17:25:33 0 2K
Telangana
మంచిర్యాల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు, నగది ఉన్న భాగ్యం మర్చిపోగా ఆ భాను పోలీసులకు...
By Bonagiri RaviShankar 2026-05-26 13:45:11 0 138
Telangana
"సంచలన జర్నలిజం కంటే బాధ్యతాయుత జర్నలిజం గొప్పది.|
హైదరాబాద్ : మీడియా ట్రయల్స్, సోషల్ మీడియా ప్రచారం, కుటుంబాల మానసిక క్షోభపై ఒక విశ్లేషణ....
By Sidhu Maroju 2026-05-12 08:45:37 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com