ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.

0
90

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు

నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ప్రసంగం

నీతి ఆయోగ్ సభ్యులతోనూ భేటీ కానున్న ముఖ్యమంత్రి

రేపు అస్సాం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అక్కడ 11.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం, సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ఆయన భేటీ కానున్నారు.

 

రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, మంగళవారం ఉదయం అక్కడి నుంచి గువాహటికి వెళ్తారు. అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తిరిగి అమరావతికి బయల్దేరి వస్తారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డాలర్ @90.93 పైస ఆల్ టైం రికార్డ్ పతనమైన రూపాయి
*డాలర్ @ రూ.90.83*   ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ   *రికార్డ్‌...
By Rajini Kumari 2025-12-16 11:38:37 0 240
Telangana
"డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం”.. గాంధీ వద్ద కుటుంబ సభ్యుల ఆవేదన.|
సికింద్రాబాద్ : గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి చెందిన ఘటన...
By Sidhu Maroju 2026-05-23 07:07:01 0 267
Andhra Pradesh
యువత మాదక ద్రవ్యాలకి దూరం గా ఉండాలి !
కర్నూలు :కర్నూలు జిల్లా... మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన 5 మందికి కౌన్సిలింగ్ మరియు...
By Hari Krishna 2025-12-24 16:31:17 0 256
Andhra Pradesh
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి...
By Kothuru Murali 2025-12-29 13:43:28 0 184
Andhra Pradesh
మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:25:51 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com