కొండ ప్రాంత ప్రజలకు అండగా ఉంటాం కేసినేని చిన్ని

0
96

*ప్రెస్ నోట్*

 

9-5-2026

 

*కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం*

 

 

*విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త*

 

*ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన*

 

*మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు*

 

*సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని*

 

 

విజయవాడ( ఎంపీ కార్యాలయం) విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై జరిగిన కీలక విషయాలను తెలియజేశారు.

 

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ముందుగా విజయవాడ నగర వాసులు శుభవార్త తెలియజేశారు.కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ల సమావేశంలో జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే అధికారులకు సూచనలు చేయడం జరిగింది.మూడు నెలల్లోని కొండ ప్రాంతాల పోరంబోకు ప్రభుత్వ స్థలాలు లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

 

కొండ ప్రాంతాల్లో నివసించే వారు విజయవాడలో ఎక్కువగా తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారని అలాంటి వారికి ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని తెలియజేశారు.కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని ఇది చేతల ప్రభుత్వమని మరొకసారి నిరూపణ అయిందని ఎంపీ అన్నారు.ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటు బ్యాంకు గానే చూసిన పార్టీలు ఉన్నాయి కానీ వారిని ఆదుకున్నది మాత్రం కేవలం కూటమి ప్రభుత్వమేనని ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని ఎంపీ అన్నారు. త్వరలోనే 30 వేల మంది చిరకాల కోరిక సొంత ఇంటి కలను నెరవేర్చబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.

Search
Categories
Read More
International
India act responsibly said U S TREASURY SECRETARY
భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య...
By G k Nookala 2026-03-07 20:27:22 0 114
Andhra Pradesh
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన...
By Ratna Sekhar 2026-03-11 08:01:56 0 759
Andhra Pradesh
ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.
లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1...
By Pagadala Venkateswar 2026-05-04 06:20:20 0 65
Telangana
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం
సికింద్రాబాద్:  పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన...
By Sidhu Maroju 2025-10-17 10:55:29 0 400
Andhra Pradesh
హైందవ ధర్మాన్ని రక్షిద్దాం!!
కర్నూలు : బేతంచర్ల : దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు హైందవ ధర్మాన్ని పరిరక్షించే...
By Hari Krishna 2025-12-15 03:37:02 0 291
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com