చింతూరులో 'స్వచ్ఛ రథం' ప్రారంభం ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసరాలు పంపిణీ!

0
105

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన 'స్వచ్ఛ రథం' కార్యక్రమాన్ని చింతూరు మండలం టీడీపీ అధ్యక్షుడు జమాల్ ఖాన్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా వారికి నిత్యావసర వస్తువులను అందజేయనున్నారు.గ్రామాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణాన్ని కాపాడటం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ దొర, సంబంధిత శాఖల కార్యదర్శులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చేపట్టిన ఈ వినూత్న ఆలోచనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
శక్తి యాప్‌తో యువతికి రక్షణ.. మంగళగిరి పోలీసులను అభినందించిన లోకేశ్.
శక్తి యాప్ ద్వారా యువతిని రక్షించిన మంగళగిరి గ్రామీణ పోలీసులు పోలీసుల పనితీరును ట్విట్టర్...
By Pagadala Venkateswar 2026-04-27 06:15:37 0 67
Telangana
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే   తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు   సర్పంచ్...
By Ellandula Sandeep 2025-12-25 09:26:40 0 474
Telangana
దస్తూరాబాద్: పోలింగ్ కేంద్రాల సందర్శన
దస్తూరాబాద్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ కానక యాదరావు మంగళవారం సందర్శించారు. ఈ...
By Mitappaly Shiavji 2026-01-06 10:10:00 0 353
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com