మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్

0
107

*సేవే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందడుగు*

 

*మజ్జిగ పంపిణీ చేసిన గద్దె క్రాంతి కుమార్, భవకుమార్*

 

 

         తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సేవా దృక్పథంతోనే ముందుకు సాగుతారని ఇది తెలుగుదేశం పార్టీ సేవా విధానానికి నిదర్శనం అని టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.

 

           శుక్రవారం ఉదయం 16వ డివిజన్ రామలింగేశ్వర నగర్ సర్వీస్ రోడ్ కె. బిల్డింగ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కీ. శే గోగుల రమేష్ జయంతి సందర్బంగా గోగుల బ్రదర్స్ ఏసుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్, బొప్పన భవ కుమార్ లు ప్రారంభించి వాహన దారులకు మజ్జిగ, సుగంధి వాటర్ పంపిణీ చేశారు. 

 

          ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్, బొప్పన భవ కుమార్ లు మాట్లాడుతూ ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు, కార్మికులు, సాధారణ ప్రజలకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల సమయంలోనే రాజకీయాలు చేస్తుందని మిగతా సమయం అంతా సేవాదృక్పథంతో సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో టీడీపీ, జెనసేన, బీజేపీ నాయకులు శ్రేణులు ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి సమయంలో అండగా నిలబడటం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ప్రజాసేవనే ప్రధాన సిద్ధాంతంగా తీసుకుని ముందుకు సాగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదే సేవా భావనతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ అందించడం చిన్న కార్యక్రమం అయినా, దాని వెనుక ఉన్న మానవత్వమే గొప్పదని తెలిపారు. 

 

           ఈ కార్యక్రమంలో గోగుల ఏసుబాబు, రత్నం రమేష్, ఉమ్మడిశెట్టి బహదూర్, పున్నవల్లి రాధాకృష్ణ, మైలమూరి పీరుబాబు, మొకర ఆదిబాబు, సింగంశెట్టి రమేష్, రాయి రంగమ్మ, పెద్ది అన్నారావు, వేముల దుర్గారావు, పోలిపల్లి ముని, గల్లా శ్రీను, మొకర రమణ, శ్రీను తదితరులు ఉన్నారు.

Search
Categories
Read More
Telangana
జిహెచ్ఎంసి లో కాలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:10:44 0 97
Andhra Pradesh
TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్...
By Pagadala Venkateswar 2026-02-19 06:31:13 0 172
Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Cm Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 10:47:13 0 328
Andhra Pradesh
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం వైద్యశాలలో సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలి రోగులు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ
బాపట్ల: పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారిని...
By Gadiyapudi Narendra 2026-02-12 13:09:39 0 169
Andhra Pradesh
పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన – వ్యక్తికి తీవ్ర గాయాలు
తుని పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో...
By Ratna Sekhar 2026-02-18 09:10:25 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com