గురవయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

0
89

 స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు పరామర్శించి, గురవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గురవయ్య లాంటి నిస్వార్థ కార్యకర్తలు స్వేరోస్ ఉద్యమానికి పునాదిరాళ్లు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూనే, సొంత ఖర్చులతో రాష్ట్రమంతా తిరిగి స్వేరో భావజాలాన్ని ప్రచారం చేశారు. భార్య మరణించినా ఇద్దరు పిల్లలను ఒంటరి తండ్రిగా పెంచిన ఆయన త్యాగం మరువలేనిది. అని కొనియాడారు. అలాగే పిల్లల చదువు బాధ్యత కూడా స్వేరోస్ సంస్థ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 

గురవయ్య ఆశయ సాధన కోసం మనమంతా పనిచేయడమే ఆయనకు నిజమైన నివాళి. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం" అని ప్రవీణ్ కుమార్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య స్వేరో , సీనియర్ నాయకులు చడపంగు రవి, జిల్లా అధ్యక్షుడు బొల్లికొండ వీరాస్వామి, నాయకులు కందుకూరి ఉపేందర్ , ముదిగొండ చిరంజీవి, కందుకూరి శ్రీను, ముదిగొండ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రూ 10 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం
    ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని  ఎమ్మెల్యే...
By Patan Khuddus 2026-05-08 10:59:49 0 183
Telangana
బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్
ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి...
By Vadla Egonda 2025-07-14 17:52:38 0 1K
Andhra Pradesh
తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎం
తాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి...
By Gitta Raju 2026-04-07 01:28:13 0 163
Andhra Pradesh
హిందూపురంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న పర్యటన: పలువురు ప్రముఖులతో భేటీ
హిందూపురం: హిందూపురం పర్యటనలో భాగంగా గౌరవనీయులైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ వి....
By Venugopal Gopal 2025-12-27 11:32:17 0 1K
Andhra Pradesh
2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..
2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత...
By John Baji 2025-12-29 12:51:04 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com