బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం : MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
78

 

 

 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రావలసిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  పిలవడం తీవ్ర శోచనీయం. ఇది రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట, ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక పదేళ్ల తన సుపరిపాలనలో గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ పై చేస్తున్న దుర్మార్గ ప్రచారంలో భాగమే ఈ నోటీసులు.

తెలంగాణ యావత్ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేసి ఎలాంటి సంబంధం లేని కేసులో విచారించాలనే విషయం సమంజసం కాదు..నాలుగు కోట్ల ప్రజల అభిమాన నాయకులు కేసీఆర్ పై చేస్తున్న నిందారోపణలకు ప్రజలే సరైన సమయంలో సమాధానం చెబుతారు,

నోటీసులు,విచారణల పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ శ్రేణుల పోరాటం ఆగదు. ఎన్ని కుట్రలు, డైవర్షన్లు చేసినా ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. విచారణ జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుంది. — MLA. మర్రి రాజశేఖర్ రెడ్డి.

#sidhumaroju

ALWAL

Search
Categories
Read More
Andhra Pradesh
సి ఎస్ ఎస్ నిధులు నూరు శాతం వినియోగించాలి గుంటూరు జిల్లా కలెక్టర్. ఏ తమిమ్ అన్సారియా
 *సీఎస్ఎస్ నిధులు నూరుశాతం వినియోగించాలి* గుంటూరు, డిసెంబర్ 23:-జిల్లాలో కేంద్ర ప్రాయోజిత...
By KOTESWARARAO KVSR 2025-12-23 14:04:42 0 114
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించిన పోతిన మహేష్ అండ్ టీం చార్లెస్ పిజా కబ్
మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని...
By Rajini Kumari 2025-12-25 11:15:30 0 148
Telangana
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్...
By Sidhu Maroju 2025-08-17 07:39:47 0 503
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com