భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!

0
82

హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు కబ్జాలు చేస్తున్న వారికి బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు . నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.తమ సేవలు రాష్ట్రం మొత్తం అందుబాటులో ఉండాలని ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విస్తరణ నిర్ణయం తీసుకుందని హైడ్రా కమీషనర్ పేర్కొన్నారు.హైడ్రా తన కార్యకలాపాలతో ఇప్పటివరకు సుమారు రూ.85,000 కోట్ల విలువైన భూములను కబ్జాల నుంచి కాపాడినట్లు ఆయన ప్రకటించారు. మరో సంవత్సరంలోగా రూ.1లక్ష కోట్లు విలువైన భూములను రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

‎హైడ్రా పరిధిలో ఏకంగా రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఉందని కమిషనర్ వెల్లడించారు. భూ కబ్జాలకు సంబంధించి హైడ్రాకు వేలాది ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ అంకితభావంతో, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు వీలుగా హైడ్రా 'ప్రజావాణి' కార్యక్రమాన్ని నాలుగు వారాల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పులి నరేంద్రకు ఘన సన్మానం
అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పులి నరేంద్ర కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా,...
By Kothuru Murali 2026-05-17 16:49:19 0 32
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం
సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-04-08 07:34:56 0 94
Uttarkhand
Uttarakhand Goes Green: Cabinet Mandates "No Vehicle Day"
In a bold move to combat the global energy crisis, Chief Minister Pushkar Singh Dhami’s...
By Dunna Jessicaruth 2026-05-14 09:01:52 0 38
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు,...
By Chennaiah Kati 2026-01-31 14:29:43 0 238
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్
అన్నమయ్య జిల్లా సోమల మండలం లోని D-కొత్తూరులో 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ...
By Kothuru Murali 2026-03-20 05:43:35 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com