కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు

0
253

నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో గ్రామస్థులు బుధవారం ఆందోళన చేశారు. కమ్మవారిపాలెం గ్రామంలో రక్షిత మంచినీటి పథకం వద్ద మహిళలు ఖాళీ బిందెల తో నిరసన ప్రదర్శన చేశారు. గ్రామంలో వారం రోజుల నుండి మంచినీళ్లు రావటం లేదన్నారు. జలజీవన్ మిషన్ పధకం పనులు అసంపూర్తిగా వున్నాయని, గ్రామానికి వచ్చే ప్రధాన పైపు లైన్లు పగిలిపోయిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో అక్రమ మెాటారు మంచి నీటి కనెక్షన్ లు తొలగించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు కర్రి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కమ్మవారిపాలెం గ్రామంలో తక్షణమే మంచి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజులుగా మంచి నీరు రాక దాహార్తి తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ారని, ట్యాంక్ ల ద్వారా మంచి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కమ్మవారిపాలెం గ్రామ సిపిఎం నాయకులు పత్తి పాటి శ్రీనివాసరావు,చెరుకుపల్లి రమేష్, సుబ్బారావు, శ్రీనివాసరావు, శ్రీరామనేని స్వామి, మంచి దనమ్మ, ఏలూరు సామాజ్ర్యం, చండ్ర దుర్గ, రాగి స్వామి, నాగలక్ష్మి, జగిని, గౌసియా నాయక్, గోపి నాయిక్, పలువురు మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్
సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్...
By Sunka Santhosh 2026-07-17 17:27:57 0 50
SURAKSHA
Rajasthan Police Strengthen Measures for State Law & Order
The Rajasthan Police are heavily prioritizing the maintenance of law and order across the state's...
By Lokeshwari Panthadi 2026-07-04 08:10:37 0 38
Andhra Pradesh
రాగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీపీవో
శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి రాగోలు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. గంగీబాబు...
By Manda Ramkumar 2026-03-28 12:34:24 0 394
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌ శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-03-03 09:39:07 0 160
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
పుంగనూరు పట్టణంలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం...
By Kothuru Murali 2026-04-11 06:27:20 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com