ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు
Posted 2026-05-05 09:14:36
0
127
దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం'. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉచిత ప్రయాణ హామీ, ఇప్పుడు మ్యానిఫెస్టోల్లో తిరుగులేని 'మాస్టర్ స్ట్రోక్'గా మారింది. ఇప్పటికే మూడు ప్రధాన రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ పథకం, సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరిన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన 'మహాలక్ష్మి' పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 2026 ఫిబ్రవరి నాటికి సుమారు 273 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు దాదాపు రూ. 10,000 కోట్ల వరకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణ శాతం 40% నుంచి ఏకంగా 67%కి పెరగడం ఈ పథకం విజయానికి నిదర్శనం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అల్వాల్లో 20 సీసీ కెమెరాల ప్రారంభం.|
"మల్కాజ్గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి...
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష...
ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు
*పత్రికా ప్రకటన*
*ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*...
కడెం ప్రభుత్వసుపత్రి ఎదుట ఆశా వర్కర్ల నిరసన!!
ఆశ వర్కర్ల సమస్యలను పరిస్కారించాలని డిమాండు చేస్తూ కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠయించి ఆశ...