విద్యార్థుల కలలకు రెక్కలు

0
198

కలలకు రెక్కలు:

నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం

విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల సౌమ్య – బడుగు విద్యార్థుల కల నెరవేర్చిన ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం

 

నందిగామ, మే 5: భారత్అవాజ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే శ తంగిరాల సౌమ్య  ఆధ్వర్యంలో ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం కింద పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆరు మంది విద్యార్థులు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కలలు సాకారం చేసే దిశగా ఒక మంచి అడుగు అని అందరూ ప్రశంసించారు.

విమాన ప్రయాణంలో పాల్గొన్న విద్యార్థులు

షేక్ అర్షియా నాజ్ – కంచికచర్ల మండలం మొగులూరు జిల్లా పరిషత్ హైస్కూల్, 589 మార్కులు.

ప్రజాపతి పర్వీన్ – నందిగామ మండలం లింగాలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, 576 మార్కులు.

వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు – జిల్లా పరిషత్ హైస్కూల్, 571 మార్కులు.

పల్లె పోగు వినీల – చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం గురుకుల పాఠశాల, 567 మార్కులు.

నారిశెట్టి జగదీష్ ఆదిత్య – చందర్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, 559 మార్కులు.

ఉప్పులూరి సోనీ ప్రియా – నందిగామ పట్టణం అనాసాగరం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్, 549 మార్కులు.

ఈ విద్యార్థులంతా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న సామాన్యులు. సాధారణంగా బస్సు, కారు లేదా రైలు ప్రయాణాలకు మాత్రమే అలవాటు పడిన వీరికి విమాన ప్రయాణం ఒక కల. ఆ కలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ద్వారా నెరవేర్చారు. విద్యలో పెను మార్పులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు విద్యా రంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు ఫలితాలను ఇస్తున్నాయని ఎమ్మెల్యే సౌమ్య గారు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు 81.14 శాతం ఉండగా, ఈ సంవత్సరం 85.25 శాతానికి చేరాయి. నందిగామ నియోజకవర్గంలోనూ గత సంవత్సరం 74.80 శాతం నుంచి ఈ సంవత్సరం 80.08 శాతానికి పెరిగింది. విద్యా మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ఉపాధ్యాయులకు సింగపూర్ విదేశీ పర్యటనలు, విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆమె అన్నారు.

గురువులు, తల్లిదండ్రుల స్ఫూర్తి

విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కీలకమని ఎమ్మెల్యే సౌమ్య గారు పేర్కొన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని, కలలు సాకారం చేసుకునే స్ఫూర్తిని నింపుతుందని అందరూ ఆశా భావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు,విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, కూటమి నేతలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ఇంచార్జీల వివరాలు
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం సుధీర్ఘంగా...
By Ponnala Srinivasrao 2026-05-13 00:15:34 0 66
Telangana
నిజామాబాద్
పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి...
By Sadaq Sadaq 2026-05-05 07:45:12 0 100
Andhra Pradesh
హిందూ సమ్మేళనం ఓదివేడు
ఈరోజు ఓదివీడు హిందూ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంబాత్రేయ క్షేత్రం  పీఠాధిపతి ఘనంగా...
By Benguluri Madhubabu 2026-01-14 06:53:51 0 313
Chandigarh
High Court Transfers Col. Bath Assault Case to CBI After Police Failures
The Punjab and Haryana High Court has directed the Central Bureau of Investigation (CBI) to take...
By Bharat Aawaz 2025-07-17 05:59:21 0 2K
Andhra Pradesh
మోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగాని పల్లె పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి గ్రామాల్లో గత కొన్ని...
By Kothuru Murali 2026-01-06 09:17:03 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com