విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.

0
94

తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం

విజయ్ అద్భుత విజయం సాధించారని కొనియాడిన చంద్రబాబు

తమిళ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష

తమిళనాడులో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నటుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ప్రభంజనం సృష్టించడంపై చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

 

ఈ సందర్భంగా విజయ్‌ని ప్రశంసిస్తూ చంద్రబాబు ఒక పోస్ట్ చేశారు. "తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు విజయ్‌కు నా అభినందనలు. తమిళనాడు ప్రజలకు సేవ చేయడంలో, వారి పురోగతి, శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సంపూర్ణంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే అద్భుతమైన ఫలితాలు సాధించిన విజయ్‌కు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'    -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-03-13 13:11:14 0 170
Telangana
నిజామాబాద్: శ్రీ నీలకేశ్వరాలయంలో ఉగాది పంచాంగ శ్రావణం
జిల్లా లోని నీలకంఠేశ్వరాలయం ఉగాది పండగ శోభాతో కలకలడిo కలకాలాడిoధి.గురువారం ఆలయంలో శాస్రోక్తంగా...
By Sadaq Sadaq 2026-03-19 17:27:27 0 188
Business & Finance
Rising Oil Prices Trigger Fuel Hikes and Economic Growth Forecast Cuts
Geopolitical tensions in the Middle East have pushed Brent crude past $105 a barrel, sending...
By Dunna Jessicaruth 2026-05-19 11:12:58 0 194
Andhra Pradesh
గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం
గుంటూరులో అర్ధరాత్రి సమయంలో యువకులు వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా...
By John Baji 2025-12-28 04:23:13 0 265
Andhra Pradesh
నందిగామలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా (ప్రముఖ న్యాయవాది )
వడదెబ్బ నివారణ నందిగామ పట్టణం గురువారం ఉదయం గాంధీ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బొందలపాటి...
By Patan Khuddus 2026-05-07 10:52:28 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com