విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.

0
93

తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపిన ఏపీ సీఎం

విజయ్ అద్భుత విజయం సాధించారని కొనియాడిన చంద్రబాబు

తమిళ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆకాంక్ష

తమిళనాడులో 107 సీట్లతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన నటుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ప్రభంజనం సృష్టించడంపై చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

 

ఈ సందర్భంగా విజయ్‌ని ప్రశంసిస్తూ చంద్రబాబు ఒక పోస్ట్ చేశారు. "తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినందుకు విజయ్‌కు నా అభినందనలు. తమిళనాడు ప్రజలకు సేవ చేయడంలో, వారి పురోగతి, శ్రేయస్సు కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సంపూర్ణంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే అద్భుతమైన ఫలితాలు సాధించిన విజయ్‌కు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వేటపాలెం సమీపంలో టాటా ఏసీ ఆటోలో అగ్ని ప్రమాదం తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం
చీరాల: చీరాల–ఒంగోలు జాతీయ  రహదారి 216పై వేటపాలెం మండలం సమీపంలో బుధవారం ప్రయాణిస్తున్న...
By Gadiyapudi Narendra 2026-02-05 13:09:24 0 195
Andhra Pradesh
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!
చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే...
By Shyamala Yadagiri 2026-06-03 11:43:59 0 191
Andhra Pradesh
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలు పరామర్శించిన వైఎస్ఆర్సిపి నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మిక కుటుంబాల్ని పరామర్శించిన వైఎస్ఆర్ సిపి నేతలు...
By Rajini Kumari 2026-06-09 12:38:13 0 223
Telangana
నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది....
By Sriramula Anil 2026-06-06 05:56:31 0 620
Telangana
Peddapalli : పెట్రోల్ టెన్షన్ వద్దు.. స్టాక్ ఫుల్: పౌరసరఫరాల శాఖ
Peddapalli 
By Sunka Santhosh 2026-03-25 09:55:20 0 302
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com