ఇంద్రకీలాద్రి మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేసినేని శివనాథ్ జానకి లక్ష్మి

0
170

*ప్రచారుణార్ధం * *07.03.2026*

 

 *ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్, జానకి లక్ష్మి దంపతులు* 

- ఘన స్వాగతం పలికిన ఆలయ పాలకమండలి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు , అధికారులు

 

 *విజయవాడ* :: ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవంలో కేశినేని శివనాద్ (చిన్ని), జానకీ లక్ష్మి దంపతులు శనివారం పాల్గొన్నారు. ఎంపీ శివనాధ్ (చిన్ని), జానకీ లక్ష్మీ దంపతులకు ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) , ఆలయ ఈవో శీనా నాయక్ , ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని చిన్ని, జానకి లక్ష్మీ దంపతులు కనకదుర్గమ్మ అమ్మవారికి పసుపు కుంకుమ, పండ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ బంగారు తాపడ రాజగోపురానికి నమస్కరించి ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ అన్నారు. మహా కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్ల తీరు తెన్నులను ఆలయ పాలకమండలి చైర్మన్, ఈవో ను అడిగి ఎంపీ శివనాద్ తెలుసుకున్నారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా మహా కుంభాభిషేక క్రతువును దిగ్విజయంగా జరిగేలా చూడాలని సూచించారు. ఎంపీ కేశినేని శివనాద్ దంపతులకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎం. వెంకట రాఘవ రాజు, టి. పద్మావతి, మన్నే కళావతి, సుకాసి సరిత, వెలగపూడి శంకర్ బాబు స్వాగతం పలికిన వారిలో ఉండగా టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ పోలీసుల అవగాహన కార్యక్రమాలు
సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన...
By Kalaga Sailaja 2026-06-24 07:53:51 0 70
Andhra Pradesh
గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!.
  గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు!...
By Pagadala Venkateswar 2026-06-10 06:11:33 0 66
Business & Finance
Monsoon Rains Disrupt Trade Across Nagaland
Heavy monsoon rainfall has disrupted transportation, logistics, and commercial activity across...
By Navya Sree 2026-07-02 13:31:08 0 106
International
EAM Dr. S. Jaishankar Meet US DNI Tulsi Gabbard in Washington DC .....
EAM Dr. S. Jaishankar: Delighted to meet US DNI Tulsi Gabbard in Washington DC this...
By Bharat Aawaz 2025-07-03 07:32:43 0 2K
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com