తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.

0
100

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన

ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన అంబులెన్స్

రోగి సహా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురి మృతి

తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ వేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్‌ లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా నుంచి ఓ రోగిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆసుపత్రికి అంబులెన్స్‌ లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన అంబులెన్స్, అప్పటికే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతులంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

 

ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

 

సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ పాఠశాల ప్రవేశానికి ఈ నెల 12 వరకు గడువు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 12...
By Kothuru Murali 2026-03-06 11:30:24 0 134
Andhra Pradesh
వైసిపి ప్రభుత్వం నిలిపివేసిన బ్రాహ్మణ పథకాలన్నీ పునరుద్ధ రిస్తాం
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*   గత వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిన బ్రాహ్మణ సంక్షేమ...
By Rajini Kumari 2025-12-22 08:01:06 0 238
Andhra Pradesh
బోడినాయుని పల్లె గ్రామంలో పగుళ్లు పడ్డ విద్యుత్ స్తంభం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం భీమాగాను పల్లె పంచాయతీ బోడినాయుని పల్లె గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం...
By Kothuru Murali 2026-05-04 13:11:12 0 95
Andhra Pradesh
AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత...
By Pagadala Venkateswar 2026-01-28 10:35:33 0 150
Andhra Pradesh
రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన...
By Pagadala Venkateswar 2026-06-30 07:14:51 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com