మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?

0
88

‎సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. బాధితులను చూస్తే జాలేస్తుందని, వారి తరపున ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న మంగ్లీ.. కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇప్పుడీ కేసులో అసలైన టర్నింగ్ పాయింట్‌ని పోలీసులు కనిపెట్టారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడి అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా పోలీసులు గుర్తించడంతో.. కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

‎ఇప్పటి వరకు రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్‌కు మూడు సార్లు భారీగా మనీ ట్రాన్స్‌ఫర్ జరిగిందని, అకౌంట్‌లో మనీ పడిన రోజే విత్‌ డ్రా చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రమావత్ మధు అకౌంట్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అకౌంట్స్ వివరాలు కావాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. రమావత్ అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు సింగర్ మంగ్లీ అకౌంట్స్‌‌ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనే నిర్ణయం తీసుకోవడంతో..ఈ మైక్రో ఫైనాన్స్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.

‎మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? వీళ్లేనా.. లేదంటే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు టర్నింగ్ పాయింట్ దొరికేసింది కాబట్టి.. త్వరలోనే ఈ కేసును వారు క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెరపైకి ఎవరెవరి పేర్లు వస్తాయనేది? తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే, తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్‌లో జరిగిన లావాదేవీలపై సింగర్ మంగ్లీ.. ఎలా రియాక్ట్ అవుతారు? అనేది కూడా చూడాల్సి ఉంది

Search
Categories
Read More
Telangana
మదర్ థెరెసా జయంతి: నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ జిల్లా:  కంటోన్మెంట్.     కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ...
By Sidhu Maroju 2025-08-26 08:20:03 0 445
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ప్రజా వేదిక పరిష్కారం ప్రధాన ఉద్దేశం కార్యక్రమం చేపట్టినారు.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ: 29.12.2025* _*//“ప్రజలకు సత్వర న్యాయం అందే విధంగా...
By KOTESWARARAO KVSR 2025-12-29 14:22:59 0 228
Andhra Pradesh
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి....
By Boiena Rajesh 2026-03-31 09:13:35 0 183
Andhra Pradesh
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*  ...
By Rajini Kumari 2025-12-20 12:17:56 0 153
Telangana
CMRF ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేత
చిలుకూరు గ్రామానికి చెందిన గండు సావిత్రి భర్త వెంకట్ నారాయణ గారికి కోదాడ శాసన సభ్యురాలు శ్రీమతి...
By Nookapangu Manikanta 2026-04-19 05:33:11 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com