ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృధికి నిధులు మంజూరు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
220

మంచిర్యాల జిల్లా : ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మనకే వచ్చిందని చెప్పారు .. దీనితో మత్స్య సంపద అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని చేపల విత్తన ఉత్పత్తి కూడా ఇక్కడనే చేయడం జరుగుతుందని, రాష్ట్రంలోని వివిధ చెరువులకు మత్స్య విత్తనాలను ఇక్కడి నుంచే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపడం జరిగిందన్నారు..

 దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని 70 కోట్ల రూపాయలతో రెండవ అన్నవరంగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభించి పుష్కరాల కన్నా ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు, గూడెం పైప్ లైన్ మరమ్మత్తులు చేపించాము, మోటార్ 10 నిమిషాలు కూడా బంద్ కాలేదన్నారు, అదే వాళ్ల హయాంలో తరచూ పైప్స్ పగిలేవని అన్నారు.

అలాగే పుష్కరాల సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయానికి 10 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా నైనా ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తునామన్నారు, రైతులకు సరిపోయే కరెంటు ఇస్తున్నామన్నారు, ప్రతిపక్ష నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మరియు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి, మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రుల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..

ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు , కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
SURAKSHA
Gayatri Rathore: Transforming Rajasthan Through Tourism
A distinguished 1997-batch Rajasthan cadre IAS officer, Gayatri A. Rathore has redefined tourism,...
By Lokeshwari Panthadi 2026-07-23 09:52:09 0 52
Telangana
"రామ్‌నగర్ వాసులకు ఊరటనిచ్చిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలోని రామ్‌నగర్ ప్రాంతంలో బోర్‌వెల్ పనిచేయక...
By Sidhu Maroju 2026-06-13 06:41:17 0 116
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసినికొండ జన్మభూమి కాలనీకి చెందిన చంద్ర...
By Pagadala Venkateswar 2026-05-10 05:49:08 0 99
Telangana
కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారి చేప మందు పంపిణీ కార్యక్రమం.
కరీంనగర్ జిల్లా టవర్ సర్కిల్లో గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారు మృగశిర కార్తె...
By Thalakokkula Sadanandam 2026-06-09 12:22:19 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com