ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృధికి నిధులు మంజూరు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
158

మంచిర్యాల జిల్లా : ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మనకే వచ్చిందని చెప్పారు .. దీనితో మత్స్య సంపద అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని చేపల విత్తన ఉత్పత్తి కూడా ఇక్కడనే చేయడం జరుగుతుందని, రాష్ట్రంలోని వివిధ చెరువులకు మత్స్య విత్తనాలను ఇక్కడి నుంచే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపడం జరిగిందన్నారు..

 దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని 70 కోట్ల రూపాయలతో రెండవ అన్నవరంగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభించి పుష్కరాల కన్నా ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు, గూడెం పైప్ లైన్ మరమ్మత్తులు చేపించాము, మోటార్ 10 నిమిషాలు కూడా బంద్ కాలేదన్నారు, అదే వాళ్ల హయాంలో తరచూ పైప్స్ పగిలేవని అన్నారు.

అలాగే పుష్కరాల సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయానికి 10 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా నైనా ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తునామన్నారు, రైతులకు సరిపోయే కరెంటు ఇస్తున్నామన్నారు, ప్రతిపక్ష నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మరియు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి, మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రుల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..

ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు , కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు...
By BABJI DADALA 2026-01-27 14:20:22 0 358
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై బడ్జెట్ పత్రులకు ప్రత్యేక పూజలు
ప్రెస్ నోట్   తేదీ: 14 ఫిబ్రవరి, 2026 ఇంద్రకీలాద్రి.   ఇంద్రకీలాద్రిపై...
By Rajini Kumari 2026-02-14 14:35:25 0 169
Andhra Pradesh
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న...
By Pagadala Venkateswar 2026-05-06 07:30:13 0 63
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు....
By Kothuru Murali 2026-01-14 08:54:40 0 156
Telangana
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్  అమెరికాలోని...
By Pinnehasan Odela 2026-01-16 09:18:22 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com