ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృధికి నిధులు మంజూరు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
222

మంచిర్యాల జిల్లా : ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మనకే వచ్చిందని చెప్పారు .. దీనితో మత్స్య సంపద అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని చేపల విత్తన ఉత్పత్తి కూడా ఇక్కడనే చేయడం జరుగుతుందని, రాష్ట్రంలోని వివిధ చెరువులకు మత్స్య విత్తనాలను ఇక్కడి నుంచే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపడం జరిగిందన్నారు..

 దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని 70 కోట్ల రూపాయలతో రెండవ అన్నవరంగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభించి పుష్కరాల కన్నా ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు, గూడెం పైప్ లైన్ మరమ్మత్తులు చేపించాము, మోటార్ 10 నిమిషాలు కూడా బంద్ కాలేదన్నారు, అదే వాళ్ల హయాంలో తరచూ పైప్స్ పగిలేవని అన్నారు.

అలాగే పుష్కరాల సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయానికి 10 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా నైనా ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తునామన్నారు, రైతులకు సరిపోయే కరెంటు ఇస్తున్నామన్నారు, ప్రతిపక్ష నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మరియు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి, మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రుల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..

ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు , కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం...
By Kothuru Murali 2026-03-13 08:57:48 0 147
SURAKSHA
ఆర్థిక మోసాలలో రికవరీ: బాధితులకు తిరిగి అందిన సొమ్ము
సైబర్ ఆర్థిక మోసాలకు గురైన బాధితుల డబ్బును తిరిగి రాబట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...
By Kalaga Sailaja 2026-06-24 09:06:28 0 79
Mizoram
Lunglei Achieves 107% HPV Vaccination Target Success
Mizoram’s healthcare sector has marked a significant milestone, with the Lunglei district...
By Lokeshwari Panthadi 2026-07-02 06:47:27 0 92
Business & Finance
Start Your Section 8 Company Registration in India
Register your Section 8 Company in India with expert assistance and a hassle-free online process....
By Navya Sree 2026-07-08 12:33:36 0 52
Telangana
పిన్నారం గ్రామంలో నీటి ఎద్దడికి చెక్... బోర్వెల్ ప్రారంభించిన మంత్రి, ఎంపీ
కోటపల్లి, జూన్ 1: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పిన్నారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను...
By Avunoori Mahesh 2026-06-01 11:18:29 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com