సింగరేణి ఉద్యోగుల సంక్షేమనికి మరో కీలక ముందడుగు : సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి

0
136

సింగరేణి సంస్థ కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌తో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, బ్యాంకులో శాలరీ అకౌంట్లు కలిగిన సింగరేణి ఉద్యోగులకు క్రింది బీమా ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి:

🔹 ప్రమాద బీమా: ₹1.20 కోట్లు

🔹 సహజ మరణ బీమా (టర్మ్ ఇన్సూరెన్స్): ₹10 లక్షలు

సింగరేణి సీఎండీ డాక్ట‌ర్ బుద్దప్రకాష్ జ్యోతి మార్గదర్శకత్వంలో డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) శ్రీ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం సాధ్యమైంది.

ఈ సందర్భంగా జి.ఎం (పర్సనల్) వెల్ఫేర్ & సి.ఎస్.ఆర్ శ్రీ జి.వి. కిరణ్ కుమార్ మాట్లాడుతూఉద్యోగుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం సింగరేణి లక్ష్యమని తెలిపారు. 

ఈ ఒప్పంద పత్రాలపై సింగరేణి మరియు బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజనల్ మేనేజర్ శ్రీ రిషికేశ్ రంజన్ కుమార్, సింగ‌రేణి జీఎంలు శ్రీమతి కవితా నాయుడు, శ్రీ ఏ‌జే‌ఎం మురళీధర్ రావు, శ్రీ ఎన్.చక్రవర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు : నడిపెల్లి దివాకర్ రావు
ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం, ఐబీ చౌరస్తాలోని...
By Avunoori Mahesh 2026-04-14 08:17:15 0 158
Andhra Pradesh
AP Pension IVRS: ఏపీ పెన్షనర్లకు అలర్ట్.. రెడీగా ఉండండి.. కాల్ రాగానే స్పందించండి!
AP Pension IVRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విషయాన్ని సవాలుగా తీసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న...
By Siva Bhaskar 2025-12-30 02:37:26 0 429
Andhra Pradesh
విజయవాడ అమ్మవారి సన్నిధికి గోమాత రాక
"విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజల నిమిత్తం...
By Rajini Kumari 2026-01-13 16:00:36 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com