ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,

0
1K

మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు, జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50,  గిరిజన కార్పొరేషన్ 8,  మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన మొత్తం ( 209 ) కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3934.860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు,అకాల వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం మ్యాచర్ వచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని, ధాన్యం కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, రవాణా చేయు విషయంలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను సిద్ధం చేయాలని, గన్ని సంచులు, మ్యాచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, టెంట్లు, చేర్లు, తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.కొనుగోళ్లు చేసిన దాన్యంకు సంబంధించి రైతుల ఖాతా వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు త్వరగా పడే విధంగా సంబంధిత సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, సివిల్ సప్లై అధికారి రమేష్, మేనేజర్ సివిల్ సప్లై నరసింహరావు, సంబంధిత నిర్వాహకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ
పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు...
By Kothuru Murali 2026-01-13 09:07:30 0 181
Telangana
ఎల్‌నినో పంజా..!
"తెలంగాణలో మారనున్న వర్షాల తీరు.. రైతులు, ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే" హైదరాబాద్ :...
By Sidhu Maroju 2026-07-06 14:35:20 0 80
Tamilnadu
Tamil Nadu Government Signs ₹18,600 Crore Investment Pact With L&T
The Tamil Nadu government has solidified a major investment partnership by signing a significant...
By Tejaswini Komanduru 2026-06-05 11:16:19 0 373
Andhra Pradesh
గద్దె అనురాధ చిట్టిబాబులకు ఎంపీ కేసినేని శివనాథ్ శుభాకాంక్షలు
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   గ‌ద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబుల కు...
By Rajini Kumari 2025-12-22 08:23:36 0 226
Andhra Pradesh
హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా...
By Pagadala Venkateswar 2026-05-30 05:16:58 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com