ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,

0
548

మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు, జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50,  గిరిజన కార్పొరేషన్ 8,  మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన మొత్తం ( 209 ) కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3934.860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు,అకాల వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం మ్యాచర్ వచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని, ధాన్యం కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, రవాణా చేయు విషయంలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను సిద్ధం చేయాలని, గన్ని సంచులు, మ్యాచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, టెంట్లు, చేర్లు, తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.కొనుగోళ్లు చేసిన దాన్యంకు సంబంధించి రైతుల ఖాతా వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు త్వరగా పడే విధంగా సంబంధిత సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, సివిల్ సప్లై అధికారి రమేష్, మేనేజర్ సివిల్ సప్లై నరసింహరావు, సంబంధిత నిర్వాహకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత ఇప్పుడు పెద్ద చర్చగా మారుతోంది. ఒక అమ్మాయి రాత్రి ఒంటరిగా బయటకు...
By Babitha Babitha 2026-05-18 09:01:13 0 46
Telangana
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైద‌రాబాద్ సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ అర్థ‌రాత్రి...
By Sidhu Maroju 2025-11-24 10:04:16 0 146
Telangana
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
    మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
By Pinnehasan Odela 2026-03-09 13:09:17 0 151
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రులు: ప్రజలకు భరోసా ఉందా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డాక్టర్ల...
By Babitha Babitha 2026-05-18 08:50:01 0 44
Telangana
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి...
By Bharat Aawaz 2025-09-20 08:20:04 0 967
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com