"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|

0
297

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగా నేడు వెంకటాపురం డివిజన్‌ పరిధిలోని ఇందిరా నగర్‌లో, ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా పాదాచారులు, రోజువారీ కూలీలు మరియు స్థానిక ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం మరియు పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

చలివేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ని ఎమ్మెల్యే అభినందించారు. 

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మొహసిన్, విజయ్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలం ముగిసే వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని చోట్ల కొనసాగుతాయని నాయకులు వెల్లడించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Haryana
HCS 2025 Mains Exam Schedule and Updates Announced
The Haryana Public Service Commission (HPSC) has officially updated the examination schedule for...
By Lokeshwari Panthadi 2026-07-01 09:11:56 0 56
Andhra Pradesh
పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం...
By Kothuru Murali 2026-04-26 10:45:51 0 90
Rajasthan
High Tech Boost: First Semiconductor Cluster In Bhiwadi
Rajasthan has achieved a major technological milestone as its first semiconductor cluster was...
By Dunna Jessicaruth 2026-05-16 08:05:54 0 111
Andhra Pradesh
చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-05-15 15:40:51 0 82
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు...
By Boya Dasthagiri 2026-05-06 15:44:27 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com