"ప్రజల దాహం తీర్చడమే లక్ష్యం: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి.|

0
149

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఇందులో భాగంగా నేడు వెంకటాపురం డివిజన్‌ పరిధిలోని ఇందిరా నగర్‌లో, ఇందిరా గాంధీ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రీమతి సబితా అనిల్ కిషోర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే ఈ కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా పాదాచారులు, రోజువారీ కూలీలు మరియు స్థానిక ప్రజల సౌకర్యార్థం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం మరియు పార్టీ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

చలివేంద్రం ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ని ఎమ్మెల్యే అభినందించారు. 

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మొహసిన్, విజయ్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలం ముగిసే వరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా మరిన్ని చోట్ల కొనసాగుతాయని నాయకులు వెల్లడించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల కేంద్రంలో తెలుగు మెయిన్ స్కూల్ అడ్మిషన్
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయడమేమనగా , మన దగ్గర ఉండే కొద్ది పాటి డబ్బులు ఖర్చుపెట్టి...
By Boya Dasthagiri 2026-05-06 15:53:09 0 102
Andhra Pradesh
పుంగనూరు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది...
By Kothuru Murali 2026-03-17 07:06:10 0 122
Andhra Pradesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీకి తూట్లు పొడిచారు: షర్మిల.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం అన్నమయ్య జిల్లాలో ఉపాధి హామీ పరిరక్షణ...
By Pagadala Venkateswar 2026-02-06 04:37:46 0 122
Telangana
ముంబై-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బస్ట్… నైజీరియన్ మహిళ అరెస్ట్.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముంబై...
By Sidhu Maroju 2026-04-03 13:20:07 0 215
Andhra Pradesh
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో...
By Chennaiah Kati 2026-01-19 16:31:31 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com